CM Hemanth Soren: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Hemanth Soren: మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు సంస్థ జారీ చేసిన రెండో సమన్ను దాటవేయడంతో జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు, సీఎం హేమంత్ సోరేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తాను సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలియజేసే లేఖను సోరెన్ ఈడీ కార్యాలయానికి ప్రత్యేక మెసెంజర్ ద్వారా పంపారు. భూకుంభకోణం కేసులో ఆగస్టు 14న తమ ముందు విచారణకు హాజరు కావాలని సోరెన్కు ఈ నెల 7న ఈడీ నోటీసులు జారీచేసింది. అయితే ఆరోజున బిజీ షెడ్యూల్ ఉండటంతో తాను విచారణకు హాజరుకాలేనని ఆయన చెప్పారు. దాంతో ఈ నెల 24న విచారణకు రావాలని ఈడీ మరోసారి సమన్లు జారీచేసింది. 24న కూడా ఆయన ఈడీ విచారణకు హాజరు కాకుండా తాను సుప్రీంకోర్టులో సవాలు చేస్తున్నట్లు ఈడీ డైరెక్టర్కు జార్ఖండ్ ముఖ్యమంత్రి తెలియజేశారు.
Read Also: Etela Rajender: బీజేపీలోకి వెళతారనే భయంతో టికెట్ లు అనౌన్స్ చేశారు..! ఈటెల సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
తాను ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రినని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని సోరెన్ వ్యాఖ్యానించారు. ఈడీ సమన్లు జారీచేసిన విధానం చూస్తే తానేదో దేశం విడిచి పారిపోతున్నట్లు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈడీ సమన్లను రాజకీయ ప్రేరేపితమైనవని సీఎం విమర్శించారు. ఆగస్టు 7 న జారీ చేసిన సమన్లను ఉపసంహరించుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ED రాంచీ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్కు రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు. అయితే ఏజెన్సీ సీఎం ఆరోపణను తిరస్కరించడమే కాకుండా ఆగస్టు 24న తమ ముందు హాజరుకావాలని కోరుతూ సోరెన్కు రెండవసారి సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్తోపాటు మరో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి హేమంత్ సోరెన్ను గతేడాది నవంబర్ 17న ఈడీ తొమ్మిది గంటలకుపైగా విచారించింది. ఇవే ఆరోపణలపై ఇప్పటికే ఐఏఎస్ అధికారి ఛవీ రంజన్, ఇద్దరు వ్యాపారవేత్తలు కోల్కతాకు చెందిన అమిత్ అగర్వాల్, రాంచీలో షాపింగ్ మాల్స్ను కలిగి ఉన్న బిష్ణు అగర్వాల్తో సహా 13 మందిని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!