Etela Rajender: బీజేపీలోకి వెళతారనే భయంతో టికెట్ లు అనౌన్స్ చేశారు..! ఈటెల సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender: బీజేపీలోకి వెళతారనే భయంతో టికెట్ లు అనౌన్స్ చేశారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నర ఏళ్లలో అన్ని ఎన్నికల్లో ప్రజాస్వామిక పద్దతుల్లో బీజేపీ గెలిచిందని అన్నారు. డబ్బుతో బీఆర్ఎస్ ఒక్కటి రెండు చోట్ల గెలిచిందని అన్నారు. తెలంగాణ ప్రజలు స్పష్టంగా కేసీఆర్ ను ఎదుర్కొనే శక్తి బీజేపీకి వున్నట్లు నాలుగున్నర ఏళ్లలో బీజేపీ గెలిచిన ఎన్నికలే నిదర్శనమని తెలిపారు. నాలుగున్నర ఏళ్లలో ఒక్క ఎన్నికలో కూడా కాంగ్రెస్ గెలువలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు ప్రాధాన్యత ఇవడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ మళ్ళీ అధికారం లోకి రావద్దని అన్ని వర్గాలు తెలంగాణలో నిర్ణయం చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ బాధ్యతలను అమిత్ షా కి ఇచ్చారని అన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి మంచి పట్టు వుందని, నిరుపిస్తామన్నారు. 27న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమిత్ షా సభను జయప్రదం చేయాలని కోరారు.
ఖమ్మం జిల్లా ప్రధాని మోడీకి అండగా ఉంటుందని చూపించాలని కోరారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధర కావాలని కోరితే రైతులకు బేడీలు వేసినది ఖమ్మం జిల్లా గిరిజనులను వ్యవసాయం నుంచి దూరం చేసే కుట్రలు జరిగాయని అన్నారు. గిరిజనుల మీద అనేక దౌర్జన్యాలు ఖమ్మం జిల్లాలో జరిగాయని తెలిపారు. చైతన్యానికి కూడా ఖమ్మం జిల్లా కేంద్రమని అన్నారు. మార్పుకు నాంది కూడా ఖమ్మం జిల్లానే అన్నారు. ధర్మానికి న్యాయానికి అండగా ఉంటారని నమ్మకమన్నారు. కేసీఆర్ కు పేదలు ధనికులు అనే తేడా వుండదని తెలిపారు. మోడీ మాత్రం పేద రైతుల పక్షపాతన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత స్ప్రింక్లర్ లు లేవు, డ్రిప్ ఇరిగేషన్, రోటవేటర్ లేదు, సబ్సిడీ లేదు, టర్పలిన్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఏ పథకం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల బీమా పథకం కూడా లేదన్నారు. పంట నష్టం కూడా ఇవ్వడం లేదని తెలిపారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
రైతు బందు ఇచ్చి అన్ని పథకాలు బంద్ చేసిన ప్రభుత్వం కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారం లోకి వచ్చిన ఏ స్కీం కూడా తీసి వేయమని స్పష్టం చేశారు. ఇంకా మంచి స్కీం లు ప్రవేశ పెడతామని హామీ ఇచ్చారు. కేసీఆర్ అక్రమంగా సంపాదించిన డబ్బు, దావత్ ల మీదే కేసీఆర్ కు నమ్మకముందని తెలిపారు. నియోజకవర్గాలకు ఇప్పటికే ,30,40 కోట్లు ఖర్చు పెట్టే గెలివాలని చూస్తున్నారని అన్నారు. కమ్యునిస్టు వారి కుటుంబంలో పుట్టిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫ్యూడల్ మనస్వత్వం వున్న వ్యక్తి అని మండిపడ్డారు. పోలీస్ లను నమ్ముకున్న వారికి పరాజయం తప్పదని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో ఒక్క సీట్ కూడా బీఆర్ఎస్ రాదని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ భయానికి గురైందని తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యే లు బీజేపీలోకి వెళతారని భయంతో టికెట్ లు అనౌన్స్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీ నాయకులను కొనుగోళ్లు చేయడం కోసం ముందే అభ్యర్థులను ప్రకటించిందని ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు.
Shamshabad: శంషాబాద్లో దుబాయ్ విమానం ఎమర్జెన్సీ లాండింగ్.. నలుగురు ప్రయాణికుల్ని దించేసిన పైలట్
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!