Japanese Encephalitis: అస్సాంలో విజృంభిస్తోన్న జపనీస్ మెదడువాపు వ్యాధి.. ఇప్పటివరకు 35 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japanese Encephalitis: అస్సాంలో వరదల పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ జపనీస్ మెదడువాపు వ్యాధి (Japanese Encephalitis) విజృంభిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 35 మంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. దోమల వల్ల వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి మెదడువాపు. ఈ వ్యాధి వల్ల మెదడులోని నాడీ కణాల్లో వాపు ఏర్పాటుతో వాటి పనితీరులో అవరోధాలు ఏర్పాడతాయి. మెదడువాపు సోకిన వారిలో సాధారణంగా తలనొప్పి, జ్వరం, వాంతులు, మతిస్థిమితం తప్పడం, అపస్మారక స్థితి, మూర్చ వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
జులైలో ఇప్పటివరకు మొత్తం 226 జపనీస్ ఎన్సెఫాలిటిస్ కేసులు కనుగొనబడ్డాయి. ఈ వ్యాధి అస్సాంలో గత 24 గంటల్లో మరో ముగ్గురు ప్రాణాలను బలిగొందని నేషనల్ హెల్త్ మిషన్ వెల్లడించింది. దీంతో ఈ వ్యాధి బారినపడి మృతిచెందిన వారి మొత్తం సంఖ్య 35కి చేరుకుంది. ఇవాళ మొత్తం 24 కొత్త కేసులను నివేదించింది. 24 కొత్త కేసుల్లో నాగావ్, బిస్వనాథ్ జిల్లాలో 4 చొప్పున, జోర్హాట్ జిల్లాలో 3, ధేమాజీ, కమ్రూప్, లఖింపూర్, నల్బరీ, సోనిత్పూర్, బక్సా, చిరాంగ్ జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.
Also Read
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
- Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
జపనీస్ మెదడువాపు వ్యాధి మొదటి కేసు 1871లో జపాన్లో నమోదు చేయబడింది. మెదడువాపు సోకిన వారిలో సాధారణంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. అనంతరం ఇన్ఫెక్షన్ సోకి అనారోగ్యానికి దారితీస్తాయి. పిల్లలలో, జీర్ణాశయాంతర నొప్పి, వాంతులు ప్రధాన ప్రారంభ లక్షణాలు కావచ్చు. తీవ్ర వ్యాధి లక్షణాలు అధిక జ్వరం, తలనొప్పి, మెడ దృఢత్వం, దిక్కుతోచని స్థితి, కోమా, మూర్ఛలు, పక్షవాతం, చివరికి మరణం కూడా సంభవించవచ్చు. వ్యాధి లక్షణాలు ఉన్నవారిలో మరణాల రేటు 30 శాతం వరకు ఉంటుంది. జీవించి ఉన్నవారిలో, 20 శాతం నుంచి 30 శాతం మంది పక్షవాతం, పునరావృత మూర్ఛలు, మాట్లాడలేకపోవడం వంటి శాశ్వత మేధో, ప్రవర్తనా లేదా నాడీ సంబంధిత పరిణామాలతో బాధపడుతున్నారు.
Railway Shock: సీనియర్ సిటిజన్లకు, జర్నలిస్టులకు రైల్వేశాఖ షాక్.. ?
వ్యాధిని నివారించడానికి సురక్షితమైన, సమర్థవంతమైనటీకాలు అందుబాటులో ఉన్నాయి. నిఘా మరియు రిపోర్టింగ్ మెకానిజమ్లను బలోపేతం చేయడంతో పాటుగా, వ్యాధి గుర్తించబడిన ప్రజారోగ్య ప్రాధాన్యత ఉన్న అన్ని ప్రాంతాల్లో నియంత్రణ కార్యకలాపాలను కలిగి ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తుంది.
తాజావార్తలు
-
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!