Railway Shock: సీనియర్ సిటిజన్లకు, జర్నలిస్టులకు రైల్వేశాఖ షాక్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ సిటిజన్లుతో పాటు.. జర్నిలిస్టులకు, విధ్యార్థులకు ఊహించని షాక్ ఇచ్చింది రైల్వేశాఖ. టికెట్ ధరపై సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీ కట్ చేయడమేకాకుండా.. విద్యార్థులు, జర్నలిస్టులకు వివిధ కోటాల్లో ఇస్తున్న సబ్సిడీలను మంగళం పాడింది. అయితే గతంలో అమలులో ఉండి ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ తొలగించిన సబ్సిడీలపై కేంద్ర సర్కార్ తాజాగా తన అభిప్రాయాన్ని తెలిపి, సబ్సీడీలను తిరిగి పునరుద్దరించే అవకాశం లేదని తేల్చి చెప్పేసింది.
నిజానికి కరోనా సమయంలోనే అన్ని రాయితీలను రైల్వే శాఖ రద్దు చేసింది. సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీని కట్ చేసింది. విద్యార్థులకు, జర్నలిస్టులకు తదితరులకు ఇచ్చే రాయితీని నిలిపివేసింది. కాగా.. 50 ఏళ్లు దాటిన మహిళలకు రైల్వే శాఖ 50 శాతం, 60 ఏళ్లు దాటిన పురుషులకు టికెట్ ధరలో 40 శాతం రాయితీ ఇచ్చేది. ఒక జర్నలిస్టులకు 50 శాతం రాయితీ, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఏడాదిలో రెండుసార్లు రాయితీపై ప్రయాణించే అవకాశం కల్పించేది. ఇక విద్యార్థులకు జాతీయ స్థాయి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాయితీలు ఉండేవి, దావ్యాంగలకు కూడా కొన్ని రాయితీలు అందించేది రైల్వేశాఖ. ఇటువంటి రాయితీలకు రైల్వే శాఖస్వస్తి చెప్పింది.
Also Read
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
- Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
అయితే గతంలో సీనియర్ సిటిజన్లకు ఉన్న రాయితీలను పునరుద్దరించే ఉద్దేశం లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా పార్లమెంట్ లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. రైల్వే శాఖకు నష్టాలు రావడానికి కారణాలు చెప్పకొచ్చారు. రైల్వే టికెట్ ధరలు తక్కువగా ఉండటమే నష్టానికి కారణమని , కొవిడ్ కారణంగా ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిందని పేర్కొన్నారు. రాయితీ వల్ల రైల్వేశాఖపై భారం పడుతోందని పేర్కొన్నారు. రాయితీ వల్ల 2017-20 మధ్య కాలంలో 4వేల 794 కోట్ల రూపాయల ఆదాయాన్ని భారతీయ రైల్వేలు నష్టపోయాయని, అందుకే సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులు, విద్యార్థులకు రాయితీ పునరుద్ధరణ కుదరదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి తేల్చి చెప్పారు.
Goods and Services Tax : ఏం తినేటట్టు లేదు..ఏం కొనేటట్టు లేదు..సామాన్యుడిపై జీఎస్టీ బాదుడు
తాజావార్తలు
-
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!