Railway Shock: సీనియర్ సిటిజన్లకు, జర్నలిస్టులకు రైల్వేశాఖ షాక్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ సిటిజన్లుతో పాటు.. జర్నిలిస్టులకు, విధ్యార్థులకు ఊహించని షాక్ ఇచ్చింది రైల్వేశాఖ. టికెట్ ధరపై సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీ కట్ చేయడమేకాకుండా.. విద్యార్థులు, జర్నలిస్టులకు వివిధ కోటాల్లో ఇస్తున్న సబ్సిడీలను మంగళం పాడింది. అయితే గతంలో అమలులో ఉండి ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ తొలగించిన సబ్సిడీలపై కేంద్ర సర్కార్ తాజాగా తన అభిప్రాయాన్ని తెలిపి, సబ్సీడీలను తిరిగి పునరుద్దరించే అవకాశం లేదని తేల్చి చెప్పేసింది.
నిజానికి కరోనా సమయంలోనే అన్ని రాయితీలను రైల్వే శాఖ రద్దు చేసింది. సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీని కట్ చేసింది. విద్యార్థులకు, జర్నలిస్టులకు తదితరులకు ఇచ్చే రాయితీని నిలిపివేసింది. కాగా.. 50 ఏళ్లు దాటిన మహిళలకు రైల్వే శాఖ 50 శాతం, 60 ఏళ్లు దాటిన పురుషులకు టికెట్ ధరలో 40 శాతం రాయితీ ఇచ్చేది. ఒక జర్నలిస్టులకు 50 శాతం రాయితీ, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఏడాదిలో రెండుసార్లు రాయితీపై ప్రయాణించే అవకాశం కల్పించేది. ఇక విద్యార్థులకు జాతీయ స్థాయి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాయితీలు ఉండేవి, దావ్యాంగలకు కూడా కొన్ని రాయితీలు అందించేది రైల్వేశాఖ. ఇటువంటి రాయితీలకు రైల్వే శాఖస్వస్తి చెప్పింది.
Also Read
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్లో కీలక వ్యాఖ్యలు
- Cockroach Janta Party: ఢిల్లీలో "కాక్రోచ్ జనతా పార్టీ" ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
అయితే గతంలో సీనియర్ సిటిజన్లకు ఉన్న రాయితీలను పునరుద్దరించే ఉద్దేశం లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా పార్లమెంట్ లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. రైల్వే శాఖకు నష్టాలు రావడానికి కారణాలు చెప్పకొచ్చారు. రైల్వే టికెట్ ధరలు తక్కువగా ఉండటమే నష్టానికి కారణమని , కొవిడ్ కారణంగా ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిందని పేర్కొన్నారు. రాయితీ వల్ల రైల్వేశాఖపై భారం పడుతోందని పేర్కొన్నారు. రాయితీ వల్ల 2017-20 మధ్య కాలంలో 4వేల 794 కోట్ల రూపాయల ఆదాయాన్ని భారతీయ రైల్వేలు నష్టపోయాయని, అందుకే సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులు, విద్యార్థులకు రాయితీ పునరుద్ధరణ కుదరదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి తేల్చి చెప్పారు.
Goods and Services Tax : ఏం తినేటట్టు లేదు..ఏం కొనేటట్టు లేదు..సామాన్యుడిపై జీఎస్టీ బాదుడు
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!