Japanese Encephalitis: అస్సాంలో విజృంభిస్తోన్న జపనీస్ మెదడువాపు వ్యాధి.. ఇప్పటివరకు 35 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japanese Encephalitis: అస్సాంలో వరదల పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ జపనీస్ మెదడువాపు వ్యాధి (Japanese Encephalitis) విజృంభిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 35 మంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. దోమల వల్ల వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి మెదడువాపు. ఈ వ్యాధి వల్ల మెదడులోని నాడీ కణాల్లో వాపు ఏర్పాటుతో వాటి పనితీరులో అవరోధాలు ఏర్పాడతాయి. మెదడువాపు సోకిన వారిలో సాధారణంగా తలనొప్పి, జ్వరం, వాంతులు, మతిస్థిమితం తప్పడం, అపస్మారక స్థితి, మూర్చ వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
జులైలో ఇప్పటివరకు మొత్తం 226 జపనీస్ ఎన్సెఫాలిటిస్ కేసులు కనుగొనబడ్డాయి. ఈ వ్యాధి అస్సాంలో గత 24 గంటల్లో మరో ముగ్గురు ప్రాణాలను బలిగొందని నేషనల్ హెల్త్ మిషన్ వెల్లడించింది. దీంతో ఈ వ్యాధి బారినపడి మృతిచెందిన వారి మొత్తం సంఖ్య 35కి చేరుకుంది. ఇవాళ మొత్తం 24 కొత్త కేసులను నివేదించింది. 24 కొత్త కేసుల్లో నాగావ్, బిస్వనాథ్ జిల్లాలో 4 చొప్పున, జోర్హాట్ జిల్లాలో 3, ధేమాజీ, కమ్రూప్, లఖింపూర్, నల్బరీ, సోనిత్పూర్, బక్సా, చిరాంగ్ జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
జపనీస్ మెదడువాపు వ్యాధి మొదటి కేసు 1871లో జపాన్లో నమోదు చేయబడింది. మెదడువాపు సోకిన వారిలో సాధారణంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. అనంతరం ఇన్ఫెక్షన్ సోకి అనారోగ్యానికి దారితీస్తాయి. పిల్లలలో, జీర్ణాశయాంతర నొప్పి, వాంతులు ప్రధాన ప్రారంభ లక్షణాలు కావచ్చు. తీవ్ర వ్యాధి లక్షణాలు అధిక జ్వరం, తలనొప్పి, మెడ దృఢత్వం, దిక్కుతోచని స్థితి, కోమా, మూర్ఛలు, పక్షవాతం, చివరికి మరణం కూడా సంభవించవచ్చు. వ్యాధి లక్షణాలు ఉన్నవారిలో మరణాల రేటు 30 శాతం వరకు ఉంటుంది. జీవించి ఉన్నవారిలో, 20 శాతం నుంచి 30 శాతం మంది పక్షవాతం, పునరావృత మూర్ఛలు, మాట్లాడలేకపోవడం వంటి శాశ్వత మేధో, ప్రవర్తనా లేదా నాడీ సంబంధిత పరిణామాలతో బాధపడుతున్నారు.
Railway Shock: సీనియర్ సిటిజన్లకు, జర్నలిస్టులకు రైల్వేశాఖ షాక్.. ?
వ్యాధిని నివారించడానికి సురక్షితమైన, సమర్థవంతమైనటీకాలు అందుబాటులో ఉన్నాయి. నిఘా మరియు రిపోర్టింగ్ మెకానిజమ్లను బలోపేతం చేయడంతో పాటుగా, వ్యాధి గుర్తించబడిన ప్రజారోగ్య ప్రాధాన్యత ఉన్న అన్ని ప్రాంతాల్లో నియంత్రణ కార్యకలాపాలను కలిగి ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తుంది.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..