Jammu Kashmir: కాశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్చ.. గ్రెనేడ్ దాడి పోలీస్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorists Grenade Attack In Jammu And Kashmir: భారత్ ఓ వైపు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సమయంలో దేశంలో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ వేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని ఖైమో ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి మరణించారు. పూంచ్ జిల్లాకు చెందిన పోలీస్ తాహిర్ ఖాన్ వీర మరణం పొందారు. నిన్న రాత్రి కుల్గామ్ జిల్లాలోని ఖైమోహ్ ప్రాంతంలో గ్రెనేడ్ దాడి జరిగింది.. తీవ్రంగా గాయపడ్డ తాహిర్ ఖాన్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.. అయితే అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించారు.
Read Also: Rajasthan: నీరు తాగినందుకు దళిత బాలుడిని కొట్టిన టీచర్.. చికిత్స పొందుతూ మృతి
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ఇదే శనివారం రోజున శ్రీనగర్ లోని ఈద్గా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలే లక్ష్యంగా గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. ఇదిలా ఉంటే గురువారం రాజౌరీ జిల్లాలో మరోసారి యూరీ తరహా దాడికి ప్రయత్నించారు ఉగ్రవాదులు. రాజౌరీ జిల్లాలోని పర్గల్ ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గరు జవాన్లు వీర మరణం పొందగా.. భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ దాడికి ముందు బుద్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఇందులో కీలక ఉగ్రవాదిగా ఉన్న లతీఫ్ రాథర్ ను మట్టుపెట్టాయి. గతంలో కాశ్మీర్ పండిట్ రాహుల్ భట్ ను కాల్చి చంపిన ఘటనతో పాటు కాశ్మీర్ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ ను చంపిన ఘటనలో లతీఫ్ రాథర్ కు సంబంధాలు ఉన్నాయి.
స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఉగ్రదాడులకు పాల్పడవచ్చని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. ముఖ్యంగా దేశ రాజధాని హై అలెర్ట్ గా ఉంది. పదివేలకు పైగా పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీని క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!