Jammu Kashmir: కాశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్చ.. గ్రెనేడ్ దాడి పోలీస్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorists Grenade Attack In Jammu And Kashmir: భారత్ ఓ వైపు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సమయంలో దేశంలో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ వేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని ఖైమో ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి మరణించారు. పూంచ్ జిల్లాకు చెందిన పోలీస్ తాహిర్ ఖాన్ వీర మరణం పొందారు. నిన్న రాత్రి కుల్గామ్ జిల్లాలోని ఖైమోహ్ ప్రాంతంలో గ్రెనేడ్ దాడి జరిగింది.. తీవ్రంగా గాయపడ్డ తాహిర్ ఖాన్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.. అయితే అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించారు.
Read Also: Rajasthan: నీరు తాగినందుకు దళిత బాలుడిని కొట్టిన టీచర్.. చికిత్స పొందుతూ మృతి
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
ఇదే శనివారం రోజున శ్రీనగర్ లోని ఈద్గా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలే లక్ష్యంగా గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. ఇదిలా ఉంటే గురువారం రాజౌరీ జిల్లాలో మరోసారి యూరీ తరహా దాడికి ప్రయత్నించారు ఉగ్రవాదులు. రాజౌరీ జిల్లాలోని పర్గల్ ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గరు జవాన్లు వీర మరణం పొందగా.. భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ దాడికి ముందు బుద్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఇందులో కీలక ఉగ్రవాదిగా ఉన్న లతీఫ్ రాథర్ ను మట్టుపెట్టాయి. గతంలో కాశ్మీర్ పండిట్ రాహుల్ భట్ ను కాల్చి చంపిన ఘటనతో పాటు కాశ్మీర్ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ ను చంపిన ఘటనలో లతీఫ్ రాథర్ కు సంబంధాలు ఉన్నాయి.
స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఉగ్రదాడులకు పాల్పడవచ్చని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. ముఖ్యంగా దేశ రాజధాని హై అలెర్ట్ గా ఉంది. పదివేలకు పైగా పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీని క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!