Jammu Kashmir: నాన్ లోకల్స్ పై ఉగ్రవాదుల గ్రెనెడ్ దాడి.. ఒకరి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు భద్రత బలగాలు క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. కొన్నాళ్ల నుంచి స్తబ్డుగా ఉన్న ఉగ్రవాదులు మరోసారి నాన్ లోకల్స్ ని టార్గెట్ చేశారు. గతంలో కూడా ఇలాగే హిందూ పండిట్లను, స్థానికేతరులపై దాడి చేశారు. ఆ సమయంలో కాశ్మీర్లోని హిందువులు పెద్ద ఎత్తున తమకు రక్షణ కల్పించాలని చెబుతూ ఆందోళనలు చేశారు.
ఇదిలా ఉంటే మరోసారి ముష్కరులు స్థానికేతరులే లక్ష్యంగా గ్రెనెడ్ దాడి చేశారు. పుల్వామా జిల్లాలోని గుదూరా ఏరియాలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో బీహార్ కు చెందిన ఓ కూలీ మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన కూలీని బీహార్ కు చెందిన సక్వా పర్సా నివాసి మొహమ్మద్ ముంతాజ్ గా గుర్తించారు. గాయపడిన వారిలో బీహర్ కు చెందిన రాంపూర్ వాసులు మహ్మద్ ఆరిఫ్, మజ్బూల్ గా గుర్తించారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
ఇటీవల కాలంలో కాశ్మీర్ లోని ఉగ్రవాదులను భద్రతా బలగాలు వేటాడి మట్టుపెడుతున్నాయి. దీంతోె తమ ఉనికిని కాపాడుకునేందుకు ఉగ్రవాదులు అమాయకులైన స్థానికేతరులనే టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా పనుల కోసం వచ్చే కూలీలే వీరికి టార్గెట్ అవుతున్నారు. గతంలో రాహుల్ భట్ అనే పండిట్ ను చంపిన తరువాత వరసగా ఉగ్రవాదులు ఇలానే కాశ్మీర్ యాంకర్, హిందూ ఉపాధ్యాయురాలిని టార్గెట్ చేసి చంపారు. అయితే వీరిని చంపిన ఉగ్రవాదులను రోజుల వ్యవధిలోనే భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అయితే గత కొన్నాళ్లుగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి టెర్రర్ గ్రూపులు కాశ్మీర్ లో క్రియాశీలం కావాలని ప్రయత్నిస్తున్నాయి.
తాజావార్తలు
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
-
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
OTR: నిజామాబాద్ కాంగ్రెస్లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..