Jammu Kashmir: నాన్ లోకల్స్ పై ఉగ్రవాదుల గ్రెనెడ్ దాడి.. ఒకరి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు భద్రత బలగాలు క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. కొన్నాళ్ల నుంచి స్తబ్డుగా ఉన్న ఉగ్రవాదులు మరోసారి నాన్ లోకల్స్ ని టార్గెట్ చేశారు. గతంలో కూడా ఇలాగే హిందూ పండిట్లను, స్థానికేతరులపై దాడి చేశారు. ఆ సమయంలో కాశ్మీర్లోని హిందువులు పెద్ద ఎత్తున తమకు రక్షణ కల్పించాలని చెబుతూ ఆందోళనలు చేశారు.
ఇదిలా ఉంటే మరోసారి ముష్కరులు స్థానికేతరులే లక్ష్యంగా గ్రెనెడ్ దాడి చేశారు. పుల్వామా జిల్లాలోని గుదూరా ఏరియాలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో బీహార్ కు చెందిన ఓ కూలీ మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన కూలీని బీహార్ కు చెందిన సక్వా పర్సా నివాసి మొహమ్మద్ ముంతాజ్ గా గుర్తించారు. గాయపడిన వారిలో బీహర్ కు చెందిన రాంపూర్ వాసులు మహ్మద్ ఆరిఫ్, మజ్బూల్ గా గుర్తించారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
ఇటీవల కాలంలో కాశ్మీర్ లోని ఉగ్రవాదులను భద్రతా బలగాలు వేటాడి మట్టుపెడుతున్నాయి. దీంతోె తమ ఉనికిని కాపాడుకునేందుకు ఉగ్రవాదులు అమాయకులైన స్థానికేతరులనే టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా పనుల కోసం వచ్చే కూలీలే వీరికి టార్గెట్ అవుతున్నారు. గతంలో రాహుల్ భట్ అనే పండిట్ ను చంపిన తరువాత వరసగా ఉగ్రవాదులు ఇలానే కాశ్మీర్ యాంకర్, హిందూ ఉపాధ్యాయురాలిని టార్గెట్ చేసి చంపారు. అయితే వీరిని చంపిన ఉగ్రవాదులను రోజుల వ్యవధిలోనే భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అయితే గత కొన్నాళ్లుగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి టెర్రర్ గ్రూపులు కాశ్మీర్ లో క్రియాశీలం కావాలని ప్రయత్నిస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!