అడివి శేష్ హీరోగా నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్‘. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా గతేడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా వేస్తూ ఈ ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 19న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు మార్చి నుండి విడుదల పోస్ట్ పోన్ చేస్తూ ఏప్రిల్కు వాయిదా వేసినట్టే కనిపిస్తోంది సిచుయేషన్. దీనికి ప్రధాన కారణం బాక్సాఫీస్ వద్ద నెలకొన్న పోటీయే అని తెలుస్తోంది.
Also Read : Varanasi OTT Deal : ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రైజ్ కు ‘వారాణసి’ నెట్ ఫ్లిక్స్ డీల్..
మార్చి 19న బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ధురంధర్ కు సీక్వెల్ గా వస్తున్న ‘ధురంధర్ 2′ రిలీజ్ అవుతోంది. ఈ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్. ‘ధురంధర్ 2’ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో స్క్రీన్స్ ఇస్తారు. ‘డెకాయిట్’ తెలుగుతో పాటు హిందీలోను రిలీజ్ అవుతుంది. అపుడు నార్త్ లోఈ చిత్రానికి సరైన సంఖ్యలో స్క్రీన్స్ దొరకడం కష్టమవుతుంది. అందుకే రిస్క్ తీసుకోకుండా సోలో రిలీజ్ కోసం ఏప్రిల్ నెలకు వెళ్లడమే ఉత్తమమని చిత్ర బృందం నిర్ణయించుకుంది. వరుస హిట్లతో ఫామ్లో ఉన్న అడివి శేష్ తన సినిమాల క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడరు. ‘డెకాయిట్’ ఒక గ్రిప్పింగ్ యాక్షన్ లవ్ స్టోరీగా తీసుకువస్తున్నాడు. అందుకే పోటీగా వచ్చే బదులు సోలో రిలీజ్ బెటర్ అని ఫీల్ అవుతున్నారు. ఏప్రిల్ నెలలో సమ్మర్ సెలవులు కూడా తోడవుతాయి కాబట్టి, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఏప్రిల్లోని కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.