Jammu Kashmir: కాశ్మీర్లో ఎన్కౌంటర్లు.. లష్కరే ఉగ్రవాది హతం.. మరో దాడిలో జవాన్ వీరమరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lashkar Terrorist Killed In Encounter: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. పుల్వామా, షోఫియాన్ జిల్లాల్లో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం పుల్వామాలో సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పలు జరిపారు. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ మరణించారు. సీఆర్పీఎఫ్ కు చెందిన సిబ్బంది గాయపడ్డారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. పుల్వామాలోని పింగ్లాన వద్ద సీఆర్పీఎఫ్, కాశ్మీర్ పోలీసుల నాకా పార్టీపై ఉగ్రవాదులు దాడులు చేశారు.
Read Also: Mallikarjun Kharge: ఎన్నిక ఏకగ్రీవం అయితే మంచిదని శశిథరూర్కు చెప్పాను
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ఇదే రోజు షోఫియాన్ లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదిని మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే పుల్వామాలో ఉగ్రవాదుల దాడి జరిగింది. చనిపోయిన ఉగ్రవాదిని నసీర్ అహ్మద్ భట్ గా పోలీసులు గుర్తించారు. ఇతను షోపియాన్ జిల్లా నౌపోరా ప్రాంతానికి చెందినవాడు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో లో అహ్మద్ భట్ తప్పించుకున్నాడు. అనేక ఉగ్రవాద నేరాల్లో ఇతను పాల్గొన్నాడని కాశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఉగ్రవాద సాహిత్యం, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు రోజు శనివారం బారాముల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. దీంట్లో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టులను హతమార్చాయి భద్రతాబలగాలు.
కాశ్మీర్ లోయలో ప్రధానం లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలు హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతున్నాయి. అమయాకులైన ప్రజలు, హిందువులు, వలస కూలీలు, కాశ్మీర్ పండిట్లే లక్ష్యంగా ఉగ్రదాడులకు పాల్పడుతున్నారు. గతంలో కాశ్మీర్ పండిట్ రాహుల్ భట్ తో పాటు స్థానికేతరులను, వలస కూలీలను దారుణంగా చంపారు. ఈ దాడులకు పాల్పడిన వ్యక్తులను భద్రతాబలగాలు వేటాడి వెంటాడి ఎన్ కౌంటర్లలో తేపేశారు.
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!