Mallikarjun Kharge: ఎన్నిక ఏకగ్రీవం అయితే మంచిదని శశిథరూర్కు చెప్పాను
Mallikarjun Kharge Comments on congress president elections: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఏకాభిప్రాయంతో అధ్యక్షుడిని ఎన్నుకుంటే మంచిదని అన్నారు మల్లికార్జున ఖర్గే. ఇదే విషయాన్ని శశిథరూర్ కు చెప్పానని ఆయన అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఎవరూ కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకోలేదని ఖర్గే అన్నారు. కొంతమంది సీనియర్ నాయకులు నన్ను పోటీ చేయాలని కోరారని ఆయన అన్నారు. నేను ఎవరికీ వ్యతిరేకంగా పోటీ చేయడం లేదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసం పోరాడుతున్నానని స్పష్టం చేశారు.
యథాతథ స్థితి, మార్పు అని శశిథరూర్ మాట్లాడుతున్న రెండు అంశాలపై పీసీసీ డెలిగేట్లు(ఓటర్లు), ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ఏ ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకోలేదని.. నిర్ణయం సమిష్టిగా ఉంటుందని ఖర్గే వెల్లడించారు. తాను కేవలం దళిత నాయకుడిగా పోటీ చేయడం లేదని.. ఓ కాంగ్రెస్ నాయకుడిగా పోటీలో ఉన్నానని.. నా పోరాటం కొనసాగుతుందని అన్నారు. నేను ఎప్పుడూ కూడా సిద్ధాంతం, విలువలు కోసమే పోరాటం చేశానని అన్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి రోజున నా ప్రచారం ప్రారంభించానని తెలిపారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Ind vs Sa: దక్షిణాఫ్రికాతో రెండో టీ20కి సిద్ధమైన భారత్.. మరి వరుణుడు కరుణిస్తాడా?
అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యే, మంత్రిగా, ప్రతిపక్ష నేతగా నా పోరాటాన్ని సాగించానని.. మళ్లీ నా పోరాటాన్ని సాగించి.. సిద్ధాంతాలు, విలువను భావి తరాలక్ు అందివ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ నేతల ప్రోత్సాహంతోనే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని..ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జీ-23 క్యాంపు లేదని ఖర్గే అన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడేందుకు నాయకులంతా కలిసి పని చేయాలనుకుంటున్నారని.. వారంతా కూడా నాకు మద్దతు ఇస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రస్తుతం మల్లికార్జున ఖర్గేతో పాటు శశిథరూర్ ఉన్నారు. ఇప్పటికే 30 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ సంతకాలు చేశారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిలకు జరగనున్నాయి. అక్టోబర్ 19న ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపుగా 25 ఏళ్ల తరువాత తొలిసారిగా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి అధ్యక్షుడు కాబోతున్నాడు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!