Jammu Kashmir: కాశ్మీర్లో ఇద్దరు హైబ్రిడ్ టెర్రరిస్టుల అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hybrid Terrorists Arrested In Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు హైబ్రిడ్ టెర్రిస్టులను అరెస్ట్ చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ టెర్రర్ గ్రూపుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్ని ఆర్మీ, పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారంతో అనంత్ నాగ్ జిల్లా వాఘామా-ఓప్జాన్ రోడ్లో ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలోనే ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్నారు.
అరెస్ట్ అయిన ఉగ్రవాదులను తన్వీర్ అహ్మద్ భట్, తుఫైల్ అహ్మద్ దార్ లుగా గుర్తించారు. వీరిద్దరు అనంత్ నాగ్ జిల్లా వాఘామా బిజ్ బెహరా, మిడోరా ట్రాల్ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఇద్దరి వద్ద నుంచి రెండు పిస్టల్స్, రెండు మ్యాగజైన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వీరిని విచారిస్తున్నారు.
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
Read Also: Karnataka: రూ. 9 వేల కోసం వ్యక్తి దారుణ హత్య
ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లాలో సంగల్దాన్, గూల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ఆదివారం భద్రతా బలగాలు ఛేదించాయి. చైనా ఆయుధాలతో పాటు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ఈ ఏడాది ఇప్పటి వరకు 72 మంది టెర్రరిస్టులను అరెస్ట్ చేయగా..151 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.
కాశ్మీర్ ప్రాంతంలో ఇటీవల కాలంలో హైబ్రిడ్ టెర్రరిజం పెరుగుతోంది. పెద్ద పెద్ద దాడులు చేయకుండా, ప్రజల్లో భయపుట్టించే విధంగా ఉగ్రవాదులు, సామాన్యప్రజల్ని టార్గెట్ చేస్తున్నారు. సామాన్య ప్రజలుగా వచ్చి.. సాధారణ ప్రజలే లక్ష్యంగా కాల్చి చంపుతున్నారు. నాన్ లోకల్స్, హిందువులు, పండిట్లు, భారత దేశానికి మద్దతుగా ఉండేవారిని టార్గెట్ చేస్తూ చంపుతున్నారు. గతంలో రాహుల్ భట్ అనే కాశ్మీరీ పండిత్ పాటు టీవీ ఆర్టిస్ అమ్రీన్ భట్, బ్యాంకు మేనేజర్, హిందూ మహిళా ఉపాధ్యాయురాలిని.. పలువురు కూలీను చంపారు. ఆర్టికల్ 370, 35 ఏ రద్దు తర్వాత భద్రతా బలగాలు, కాశ్మీర్లో ఉగ్రవాదులను వరసగా మట్టుపెడుతున్నారు. దీంతో హైబ్రిడ్ టెర్రరిజాన్ని తీవ్రవాదులు వ్యాప్తి చెస్తున్నారు.
తాజావార్తలు
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!