Terror attack: జమ్మూ కాశ్మీర్ హై అలర్ట్.. భద్రతా బలగాలపై ఉగ్రదాడికి అవకాశం..
- జమ్మూ కాశ్మీర్ హై అలర్ట్..
- భద్రతా బలగాలపై ఉగ్రదాడికి అవకాశం..
- ఇంటెలిజెన్స్ హెచ్చరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror attack: వరస ఎన్కౌంటర్లతో జమ్మూ కాశ్మీర్ ఉలిక్కిపడింది. రియాసీ బస్సుపై దాడి తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే మరో రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఆదివారం కత్రా నుంచి శివ్ ఖోరీకి భక్తులను తీసుకెళ్తున్న బస్సుపై రియాసీ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు సమీపంలోని అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.
ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం కథువా జిల్లాలో సైదా గ్రామంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక జవాన్ అమరుడు కాగా, ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. దోడా ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిగారు. ఈ ఘటనలో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
Also Read
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
వరస దాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇదిలా ఉంటే భద్రతా బలగాలపై కూడా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. రాజౌరి, జమ్మూ జిల్లాల్లోని సుందర్బానీ, నౌషెరా, దోమన, లంబేరి, అఖ్నూర్ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాల శిబిరాలపై ఆత్మాహుతి దాడికి అవకాశం ఉందని ఇంటెల్ ఏజెన్సీలు హెచ్చరించాయి.
మంగళవారం కథువాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతమయ్యారు. దోడా జిల్లాలోని భదేర్వా-పఠాన్ కోట్ రహదారిపై మంగళవారం అర్థరాత్రి రాష్ట్రీయ రైఫిల్స్, పోలీస్ జాయింట్ చెక్పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేశారు. జైషే మహ్మద్తో సంబంధం ఉన్న ‘‘కాశ్మీర్ టైగర్స్’’ అనే ఉగ్రసంస్థ దీనికి బాధ్య వహించింది. రియాసి జిల్లాలో ఆదివారం జరిగిన బస్సుపై ఉగ్రదాడిలో 10 మంది యాత్రికులు మరణించారు. ఈ దాడికి లష్కరేతోయిబా ఉగ్రసంస్థతో అనుబంధంగా పనిచేస్తున్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’’ బాధ్యత వహించింది.
తాజావార్తలు
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!