Terror attack: జమ్మూ కాశ్మీర్ హై అలర్ట్.. భద్రతా బలగాలపై ఉగ్రదాడికి అవకాశం..
- జమ్మూ కాశ్మీర్ హై అలర్ట్..
- భద్రతా బలగాలపై ఉగ్రదాడికి అవకాశం..
- ఇంటెలిజెన్స్ హెచ్చరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror attack: వరస ఎన్కౌంటర్లతో జమ్మూ కాశ్మీర్ ఉలిక్కిపడింది. రియాసీ బస్సుపై దాడి తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే మరో రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఆదివారం కత్రా నుంచి శివ్ ఖోరీకి భక్తులను తీసుకెళ్తున్న బస్సుపై రియాసీ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు సమీపంలోని అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.
ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం కథువా జిల్లాలో సైదా గ్రామంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక జవాన్ అమరుడు కాగా, ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. దోడా ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిగారు. ఈ ఘటనలో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
వరస దాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇదిలా ఉంటే భద్రతా బలగాలపై కూడా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. రాజౌరి, జమ్మూ జిల్లాల్లోని సుందర్బానీ, నౌషెరా, దోమన, లంబేరి, అఖ్నూర్ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాల శిబిరాలపై ఆత్మాహుతి దాడికి అవకాశం ఉందని ఇంటెల్ ఏజెన్సీలు హెచ్చరించాయి.
మంగళవారం కథువాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతమయ్యారు. దోడా జిల్లాలోని భదేర్వా-పఠాన్ కోట్ రహదారిపై మంగళవారం అర్థరాత్రి రాష్ట్రీయ రైఫిల్స్, పోలీస్ జాయింట్ చెక్పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేశారు. జైషే మహ్మద్తో సంబంధం ఉన్న ‘‘కాశ్మీర్ టైగర్స్’’ అనే ఉగ్రసంస్థ దీనికి బాధ్య వహించింది. రియాసి జిల్లాలో ఆదివారం జరిగిన బస్సుపై ఉగ్రదాడిలో 10 మంది యాత్రికులు మరణించారు. ఈ దాడికి లష్కరేతోయిబా ఉగ్రసంస్థతో అనుబంధంగా పనిచేస్తున్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’’ బాధ్యత వహించింది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..