S Jaishankar: యూరప్ దేశాలకు మరోసారి క్లాస్ తీసుకున్న జైశంకర్..
- మాకు బోధకులు కాదు, భాగస్వాములు కావాలి..
- యూరప్ దేశాలకు చీవాట్లు పెట్టిన ఎస్ జైశంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: యూరోపియన్ దేశాలపై మరోసారి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాల ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. ఆర్కిటిక్ సర్కిల్ ఇండియా ఫోరం సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్ దేశాలు భారత భౌగోళిక రాజకీయ వైఖరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. భారతదేశం ‘‘బోధించే వారి’’ కోసం కాదని, భాగస్వాములను కోరుకుంటుందని చెప్పారు.
భౌగోళిక రాజకీయ అంశాలపై న్యూఢిల్లీ వైఖరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్న యూరోపియన్ దేశాలను విమర్శిస్తూ, భారతదేశం “బోధకుల కోసం కాదు” భాగస్వాముల కోసం చూస్తుందని, యూరప్లోని కొన్ని దేశాలు “ఇప్పటికీ ఆ సమస్యతో పోరాడుతున్నాయి” అని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఐస్లాండ్ మాజీ అధ్యక్షుడు OG గ్రిమ్సన్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధిపతి సమీర్ సరన్తో జరిగిన సంభాషణలో యూరప్ తీరును ఆయన బహిర్గతం చేశారు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
Read Also: Harish Rao : స్టూడెంట్ల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం.. హరీష్ రావు ఫైర్..
యూరప్ దేశాల నుంచి భారత్ ఏం ఆశిస్తుందని అడిగిన ప్రశ్నకు సమాధానంగా జైశంకర్ మాట్లాడుతూ.. ‘‘ మనం ప్రపంచాన్ని చూసినప్పుడు, భాగస్వాముల కోసం చూస్తాము. ముఖ్యంగా కొన్ని విదేశాలు చాలా బోధనలు చేస్తారు, కానీ వాటిని సొంత దేశంలో ఆచరించరు. కొన్ని యూరప్ దేశాలు ఇప్పటికీ ఈ సమస్యతో పోరాడుతున్నాయని నేను భావిస్తున్నాను. వాటిలో కొన్ని మారిపోయాయి.’’ అని వెస్ట్రన్ దేశాలను తీవ్రంగా విమర్శించారు.
‘‘ఇప్పుడు యూరప్ దేశాలు వాస్తవిక వైపు అడుగులు వేయగలరా లేదా అనేది చూడాలి. మనం భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే, కొంత అవగాహన ఉండాలి, కొంత సున్నితత్వం ఉండాలి, పరస్పర ప్రయోజనాల పట్ల అవగాహన ఉండాలి, ప్రపంచం ఎలా పనిచేస్తుందో గ్రహించాలి, ఈ విషయంలో కొన్ని యూరప్ దేశాలు సమర్థంగా ఉన్నాయి. మరికొన్ని వెనకబడి ఉన్నాయి.’’ అని అన్నారు.
గతంలో కూడా జైశంకర్ వెస్ట్రన్ దేశాలు, ముఖ్యంగా యూరప్ దేశాల విషయంలో కఠినమైన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధ సమయంలో వెస్ట్రన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల్ని ధిక్కరించి భారత్ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది. ఈ నిర్ణయాన్ని వెస్ట్రన్ మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా జైశంకర్ మాట్లాడుతూ.. భారత్ దిగుమతి చేసుకునే చమురును, యూరప్ మొత్తం మధ్యాహ్నానికే వాడుకుంటుందని చివాట్లు పెట్టారు. యూరప్ సమస్యలు ప్రపంచ సమస్యలుగా చూపిస్తుందని, ప్రపంచ సమస్యల్ని మాత్రం పట్టించుకోలేదని అన్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!