S Jaishankar: యూరోపియన్ దేశాలపై మరోసారి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాల ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. ఆర్కిటిక్ సర్కిల్ ఇండియా ఫోరం సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్ దేశాలు భారత భౌగోళిక రాజకీయ వైఖరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. భారతదేశం ‘‘బోధించే వారి’’ కోసం కాదని, భాగస్వాములను కోరుకుంటుందని చెప్పారు.