S Jaishankar: చైనాలో బిజీ బిజీగా జైశంకర్.. వైస్ ప్రెసిడెంట్, ఫారన్ మినిస్టర్తో భేటీ..
- చైనాలో బిజీబిజీగా జైశంకర్..
- భారత్-చైనా సంబంధాలపై కీలక చర్చలు..
- వైస్ ప్రెసిడెంట్, ఫారన్ మినిస్టర్తో జైశంకర్ భేటీ..
S Jaishankar: చైనాతో భారత సంబంధాలు నార్మల్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. జూలై 14, 15 తేదీల్లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి ఆయన డ్రాగన్ కంట్రీకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే చైనా కీలక నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మద్య సంబంధాలు క్షీణించాయి. 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా రెండు దేశాలు సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావాలని భావిస్తున్నాయి.
Read Also: Air India crash: ఎయిర్ ఇండియా క్రాష్, “ఫ్యూయల్ స్విచ్”ల తనిఖీకి ఆదేశాలు..
Also Read
- Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?
- Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
- IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
- Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
ఈ నేపథ్యంలో చైనాలో ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్తో జైశంకర్ భేటీ అయ్యారు. ‘‘ఒకరికొకరు విజయాన్ని సాధించడానికి వీలుగా భాగస్వామ్యం ఏర్పాటు చేయడం, డ్రాగన్-ఎలిఫెంట్ డ్యాన్స్ సాధించడం సరైన ఎంపిక. ఒకరి ఆందోళనల్ని మరొకరు గౌరవించుకోవాలి. చైనా-భారత్ సంబంధాల స్థిరమైన ఆరోగ్యకరమైన అభివృద్ధి సాధించాలి’’ అని జెంగ్ సోమవారం జైశంకర్ని కలిసిన తర్వాత అన్నారు. డ్రాగన్, ఏనుగు అనేది చైనా, భారత్ దేశాలను సూచిస్తుంది. గతంలో ఆదేశ అధ్యక్షుడు జిన్పింగ్ కూడా భారత సంబంధాల విషయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Ravindra Jadeja: ఎంతకు తెగించార్రా.. గెలుపు కోసం మరీ ఇంతకు దిగజారాలా..? వీడియో వైరల్
ఉపాధ్యక్షుడితో భేటీ తర్వాత, జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. ఇరువురు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. “2024 అక్టోబర్లో కజాన్లో మా నాయకుల( మోడీ-జిన్ పింగ్) సమావేశం నుండి, భారతదేశం-చైనా సంబంధం క్రమంగా సానుకూల దిశలో కదులుతోంది. ఆ ఊపును కొనసాగించడం మా బాధ్యత. ఇటీవలి కాలంలో, మా ఇద్దరికీ అంతర్జాతీయ కార్యక్రమాలలో కలుసుకోవడానికి, వ్యూహాత్మక కమ్యూనికేషన్ను నిర్వహించడానికి అనేక అవకాశాలు లభించాయి. ఇది ఇప్పుడు క్రమం తప్పకుండా జరుగుతుందని ఆశిస్తున్నాను’’ అని జైశంకర్ అన్నారు. కైలాష్ మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించినందుకు విదేశాంగ మంత్రి చైనాకు కృతజ్ఞతలు తెలిపారు. జైశంకర్ చైనా పర్యటనలో రేర్ ఎర్త్ అయస్కాంతాల ఎగుమతి, రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్, ఇతర అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?
-
8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..
-
Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
-
Mohsin Khan: “మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్”.. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?