Air India crash: ఎయిర్ ఇండియా క్రాష్, “ఫ్యూయల్ స్విచ్”ల తనిఖీకి ఆదేశాలు..
- ఎయిర్ ఇండియా క్రాష్ రిపోర్టు నేపథ్యంలో డీజీసీఏ కీలక ఆదేశాలు..
- ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లపై తనిఖీకి ఆదేశాలు..
- బోయింగ్ విమానాలపైనే ప్రత్యేక దృష్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రాథమిక రిపోర్టు వచ్చింది. ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక ‘‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’’పై అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇంధన స్విచ్లు రన్ నుంచి కటాఫ్కు మారినట్లు నిర్ధారణ అయింది. దీంతోనే ఇంజన్లకు ఇంధనం నిలిచిపోయినట్లు తేలింది. అయితే, ఇలా ఎందుకు జరిగిందనే దానిపై లోతైన విచారణ జరుగుతోంది.
Read Also: Mystery : 70,000 ఏళ్ల రహస్యం.. తమిళనాట దొరికిన తొలి మానవుడి DNA.!
Also Read
- India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
దీంతో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాల్లో ‘‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’’లను తనిఖీ చేయాలని అన్ని ఎయిర్లైన్ ఆపరేటర్లను ఆదేశించింది. ఇదే కాకుండా ఎయిర్ వర్తీనెస్ ఆదేశాలకు అనుగుణంగా విమానం ఇంజన్లు, భాగాలకు సంబంధించిన తప్పనిసరిగా మార్పులకు గురి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాలను ఎయిర్ ఇండియా, ఇండిగో నిర్వహిస్తున్నాయి.
ముఖ్యంగా, ఈ ఆదేశాలు బోయింగ్ 737, 787 డ్రీమ్లైనర్ సిరీస్లతో సహా బోయింగ్ కంపెనీ మోడళ్లకు సంబంధించింది. జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్787-8 డ్రీమ్లైనర్ రకానికి చెందినది. విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయి 270 మంది మరణించారు. టేకాఫ్ సమయంలో ఇంధన స్విచ్లు సెకన్లలోపే ఆఫ్ అయిపోయాయి. దీంతోనే ఈ ఆదేశాలను డీజీసీఏ జారీ చేసింది.
తాజావార్తలు
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
-
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్లో రెండో రౌండ్కు అర్హత
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Off The Record: భోగాపురం ఎయిర్ పోర్టులో భోజనాల గోల.. లోకల్ లీడర్ల ‘చిలక్కొట్టుడు’ లీలలు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?