Jairam Ramesh: మణిపూర్ సందర్శించేందుకు ప్రధానికి తీరిక దొరకడం లేదా..?
- మణిపూర్ సమస్యపై మోడీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..
- అక్కడి వెళ్లేందుకు తీరక లేదా అని ప్రశ్నించిన జైరాం రమేష్..
- కేంద్రానికి మణిపూర్ సమస్య పట్టడం లేదని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jairam Ramesh: ఏడాది కాలంగా మణిపూర్ సమస్య చెలరేగుతోంది. కుకీ, మైయిటీ కమ్యూనిటీల మధ్య జరిగిన జాతి ఘర్షణలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గతంతో పోలిస్తే పరిస్థితి కొంతమేర ప్రశాంతంగానే ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు కాంగ్రెస్ మణిపూర్ సమస్యను మరోసారి లేవనెత్తింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. ఆ ప్రాంత ప్రజల్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. అన్నింటికి ప్రధాని మోడీకి సమయం ఉంటుంది కానీ మణిపూర్ సందర్శించేందుకు ప్రధానికి తీరిక దొరకడం లేదని విమర్శించారు.
Read Also: Team India Prize Money: టీమిండియాకు గుడ్న్యూస్.. రూ.125 కోట్ల నగదు బహుమతి
Also Read
మణిపూర్లో గతేడాది ఇదే సమయానికి మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ రాజీనామాపై పెద్ద డ్రామా జరిగిందని, అప్పటి నుంచి అక్కడి ప్రజల వేదన కేంద్రానికి పట్టడం లేదని దుయ్యబట్టారు. అనేక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ప్రధానికి సమయం దొరికిందనిన, కానీ నిత్యం సమస్యలను ఎదుర్కొంటున్న మణిపూర్ సందర్శించేందుకు తీరిక లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, కనీసం ఆ సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యేందుకు సిద్ధంగా లేరని ఎక్స్ వేదికగా ఆరోపించారు.
గతేడాది మే నెలలో మణిపూర్లో కుకీ, మైయిటీ తెగల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎస్టీ హోదా ఇచ్చే అంశాన్ని కుకీలు వ్యతిరేకించడంతో ఇరు వర్గాల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 225 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?