Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajay Bhupathi: శ్రీనివాస మంగాపురం సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, స్టార్ హీరో మహేష్ బాబు అన్న కొడుకు జయ కృష్ణ హీరోగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రం జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ.. చేసిన క్రేజీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ.. తన సినిమాలపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు, తాను కథ చెప్పే విధానం, తన సిగ్నేచర్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన ప్రతి సినిమాలో కొత్తదనం ఉండాలని, ఒకే తరహా జానర్లో సినిమాలు చేయడం తనకు ఇష్టం ఉండదని వెల్లడించారు. తన సినిమాల్లో క్లైమాక్స్లో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడిందని, అయితే ప్రతి సినిమాకు ముందుగానే ట్విస్ట్ను దృష్టిలో పెట్టుకుని కథ రాయడం సరైన విధానం కాదని అన్నారు. కథ సహజంగా సాగినప్పుడే ప్రేక్షకులకు నిజమైన అనుభూతి కలుగుతుందని చెప్పారు. “ఒకే రుచితో హోటల్ నడపలేం.. కొంతకాలం తర్వాత ప్రేక్షకులు కొత్త రుచులను కోరుకుంటారు. అలాగే సినిమాల్లో కూడా ఒకే జానర్లో కొనసాగితే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది” అని ఆయన వివరించారు.
Also Read
- Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
దర్శకులు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, సిగ్నేచర్ స్టైల్ను ఏర్పరుచుకోవాలని అజయ్ భూపతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన గురువు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రస్తావిస్తూ, ఆయన కెరీర్లో ‘శివ’, ‘క్షణ క్షణం’, ‘రంగీలా’, ‘సత్య’, ‘సర్కార్’, ‘రక్త చరిత్ర’ వంటి విభిన్న జానర్ల సినిమాలు చేసినప్పటికీ, ప్రతి సినిమాలో ఆయన మేకింగ్ స్టైల్ కనిపిస్తుందని అన్నారు. ఒక దర్శకుడి పేరు తెలియకుండానే సినిమా చూస్తే అది ఎవరి స్టైలో చెప్పగలిగే స్థాయికి చేరుకోవడమే గొప్పదని అజయ్ భూపతి అభిప్రాయపడ్డారు. రామ్ గోపాల్ వర్మతో పాటు పెద్ద వంశీ, విశ్వనాథ్, బాపు, మణిరత్నం వంటి దర్శకులకు కూడా ప్రత్యేకమైన సిగ్నేచర్ ఉందని తెలిపారు. తన సినిమాల విషయంలో కూడా అలాంటి ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తున్నానని అజయ్ భూపతి చెప్పారు. భవిష్యత్తులో తాను కామెడీ సినిమా చేసినా, మరో జానర్ ఎంచుకున్నా తన శైలి మాత్రం ప్రేక్షకులకు కనిపించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా తన గత చిత్రాలకు భిన్నంగా ఉన్నప్పటికీ, తన మేకింగ్ స్టైల్ మాత్రం కనిపిస్తుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Smart Ration Cards : గుడ్న్యూస్.. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
-
Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
-
UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!