Bangladesh: బంగ్లాదేశ్లో హిందూ పూజారి హత్య.. ఇస్కాన్ ఆందోళన..
- బంగ్లాదేశ్ హిందువులపై ఆగని దాడులు..
- హిందూ పూజారి హత్య, ఆలయం ధ్వంసం..
- మైనారిటీల భద్రతపై ఇస్కాన్ ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో హిందువులతో పాటు ఇతర మైనారిటీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ప్రతీరోజు అక్కడ రాడికల్ ఇస్లామిస్టులు హిందువులు టార్గెట్గా దాడులకు తెగబడుతున్నారు. హిందువుల ఆస్తులు, దేవాలయాలు, ఇళ్లు, వ్యాపారాలు ప్రతీదాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు తీసుకున్నాక, ఈ దాడులు మరింత ఎక్కువయ్యాయి. అక్కడి ప్రభుత్వం మతోన్మాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
Read Also: PM Modi: కువైట్.. మినీ ఇండియాలా ఉంది.. హలా మోడీ ప్రోగ్రామ్లో ప్రధాని వ్యాఖ్య
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ నాటోర్లోని ఒక శ్మశాన వాటిక సమీపంలోని ఆలయంలో హిందూ పూజారి తరుణ్ చంద్ర దాస్ హత్య జరిగింది. ఈ హత్యను ఇస్కాన్ కోల్కతా వైస్ ప్రెసిడెంట్ రాధారమన్ దాస్ ఖండించారు. నేరస్తులు ఆలయంలోని విలువైన వస్తువుల్ని కూడా దోచుకెళ్లారు. పోలీసులు ఈ సంఘటనను దోపిడీగా చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం బీర్గంజ్ ఉపజిల్లాలోని జర్బరీ గ్రామంలో మూడు హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. హిందూ దేవీదేవతల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఇదిలా ఉంటే, క్రిస్మస్ పండగ దగ్గర పడుతుండటంతో దాడులు జరుగుతాయేమో అనే భయంలో అక్కడి క్రిస్టియన్లు ఉన్నారు. నాటోర్ ఘటన విషయాని వస్తే హిందూ పూజారి తరుణ్ చంద్ర దాస్ కాళ్లు చేతులు కట్టేసి, చిత్రహింసలకు గురి చేసి చంపినట్లు తెలుస్తోంది.
మతపరమైన మైనారిటీలను రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఇస్కాన్ కోల్కతా కోరింది. ఈ ఏడాదిలో హిందువులపై బంగ్లా వ్యాప్తంగా 2200 హింసాత్మక దాడులు జరిగాయని భారత విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఇటీవల పార్లమెంట్లో వ్రాతపూర్వకంగా తెలియజేశారు. పాకిస్తాన్తో పోలిస్తే ఈ ఏడాది బంగ్లాదేశ్లోనే హిందువులపై ఎక్కువ దాడులు చోటు చేసుకోవడం గమనార్హం.
తాజావార్తలు
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!