Bangladesh: బంగ్లాదేశ్లో హిందూ పూజారి హత్య.. ఇస్కాన్ ఆందోళన..
- బంగ్లాదేశ్ హిందువులపై ఆగని దాడులు..
- హిందూ పూజారి హత్య, ఆలయం ధ్వంసం..
- మైనారిటీల భద్రతపై ఇస్కాన్ ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో హిందువులతో పాటు ఇతర మైనారిటీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ప్రతీరోజు అక్కడ రాడికల్ ఇస్లామిస్టులు హిందువులు టార్గెట్గా దాడులకు తెగబడుతున్నారు. హిందువుల ఆస్తులు, దేవాలయాలు, ఇళ్లు, వ్యాపారాలు ప్రతీదాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు తీసుకున్నాక, ఈ దాడులు మరింత ఎక్కువయ్యాయి. అక్కడి ప్రభుత్వం మతోన్మాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
Read Also: PM Modi: కువైట్.. మినీ ఇండియాలా ఉంది.. హలా మోడీ ప్రోగ్రామ్లో ప్రధాని వ్యాఖ్య
Also Read
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి బాధ్యులు వారే.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణపై భారత్ సీరియస్..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ నాటోర్లోని ఒక శ్మశాన వాటిక సమీపంలోని ఆలయంలో హిందూ పూజారి తరుణ్ చంద్ర దాస్ హత్య జరిగింది. ఈ హత్యను ఇస్కాన్ కోల్కతా వైస్ ప్రెసిడెంట్ రాధారమన్ దాస్ ఖండించారు. నేరస్తులు ఆలయంలోని విలువైన వస్తువుల్ని కూడా దోచుకెళ్లారు. పోలీసులు ఈ సంఘటనను దోపిడీగా చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం బీర్గంజ్ ఉపజిల్లాలోని జర్బరీ గ్రామంలో మూడు హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. హిందూ దేవీదేవతల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఇదిలా ఉంటే, క్రిస్మస్ పండగ దగ్గర పడుతుండటంతో దాడులు జరుగుతాయేమో అనే భయంలో అక్కడి క్రిస్టియన్లు ఉన్నారు. నాటోర్ ఘటన విషయాని వస్తే హిందూ పూజారి తరుణ్ చంద్ర దాస్ కాళ్లు చేతులు కట్టేసి, చిత్రహింసలకు గురి చేసి చంపినట్లు తెలుస్తోంది.
మతపరమైన మైనారిటీలను రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఇస్కాన్ కోల్కతా కోరింది. ఈ ఏడాదిలో హిందువులపై బంగ్లా వ్యాప్తంగా 2200 హింసాత్మక దాడులు జరిగాయని భారత విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఇటీవల పార్లమెంట్లో వ్రాతపూర్వకంగా తెలియజేశారు. పాకిస్తాన్తో పోలిస్తే ఈ ఏడాది బంగ్లాదేశ్లోనే హిందువులపై ఎక్కువ దాడులు చోటు చేసుకోవడం గమనార్హం.
తాజావార్తలు
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?