Delhi: దీపావళి నాడు ఢిల్లీలో భారీ దాడులకు ఐసిస్ ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు
- దీపావళి నాడు ఢిల్లీలో భారీ దాడులకు ఐసిస్ ప్లాన్
- వెలుగులోకి సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో భారీ కుట్రకు ప్లాన్ చేసిన ఐసిస్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని సాదిక్ నగర్కు చెందిన ఎండీ అద్నాన్ ఖాన్, అలియాస్ అబూ ముహారిబ్ (19), భోపాల్కు చెందిన అద్నాన్ ఖాన్ అలియాస్ అబూ మొహమ్మద్ (20) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్పెషల్ పోలీసులు విచారించారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీపావళి (20-10-2025)కి ఢిల్లీలో భారీ దాడులకు ప్రణాళిక రచించినట్లు అధికారులు తెలిపారు.
ఇద్దరు ఉగ్రవాదులు ఐసిస్ ఉగ్రవాద సంస్థకు విధేయత చూపుతున్నట్లు ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. నిందితులిద్దరూ సిరియా సరిహద్దులో ఉన్నట్లు చెప్పుకునే హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని.. భారతదేశంలో ఐసిస్ తరపున పనిచేయడానికి వీరిద్దరిని నియమించినట్లుగా వర్గాలు తెలిపాయి. ఇద్దరిలో కూడా చాలా తీవ్రవాద భావాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. సిరియాకు చెందిన ఐసిస్ హ్యాండ్లర్ అబు ఇబ్రహీం అల్-ఖురేషితో నిరంతరం కమ్యూనికేషన్లో ఉన్నారని.. అతని సూచనల మేరకు ఢిల్లీలో భారీ కుట్రలకు ప్లాన్ చేసినట్లుగా అధికారులు తేల్చారు.
Also Read
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
- India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
ఇది కూాడా చదవండి: Maharashtra: డాక్టర్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు.. ఓ ఎంపీ ఏం చేశాడంటే..!
ప్రాథమిక విచారణలో నిందితుల్లో ఒకడు కీలక విషయాలు వెల్లడించాడు. సోషల్ మీడియా ద్వారా భోపాల్కు చెందిన వ్యక్తితో సంప్రదింపులు జరిపినట్లు తెలిపాడు. జిహాదీ సిద్ధాంతాలను ఆన్లైన్ ద్వారా షేర్ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇద్దరు ఉగ్రవాదులు కూడా విద్యావంతులని.. సాధారణ జీవితాలను గడుపుతున్నారని అధికారులు వెల్లడించారు. స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్ వాడకంతో ఇద్దరు కూడా ఐసిస్కి ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దీపావళి సమయంలో ఢిల్లీ భారీ దాడులకు కుట్ర పన్నినట్లుగా కనుగొన్నారు. ఢిల్లీలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక ప్రముఖ మాల్ లేదా ఒక పబ్లిక్ పార్కును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడి చేయడానికి కుట్ర పన్నినట్లుగా విచారణలో తేలింది.
ఇది కూాడా చదవండి: Osama bin Laden: ఆ సమయంలో లాడెన్ ఆడ వేషంలో తప్పించుకున్నాడు.. మాజీ సీఐఏ అధికారి వెల్లడి
తాజావార్తలు
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!