Delhi: దీపావళి నాడు ఢిల్లీలో భారీ దాడులకు ఐసిస్ ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు
- దీపావళి నాడు ఢిల్లీలో భారీ దాడులకు ఐసిస్ ప్లాన్
- వెలుగులోకి సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో భారీ కుట్రకు ప్లాన్ చేసిన ఐసిస్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని సాదిక్ నగర్కు చెందిన ఎండీ అద్నాన్ ఖాన్, అలియాస్ అబూ ముహారిబ్ (19), భోపాల్కు చెందిన అద్నాన్ ఖాన్ అలియాస్ అబూ మొహమ్మద్ (20) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్పెషల్ పోలీసులు విచారించారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీపావళి (20-10-2025)కి ఢిల్లీలో భారీ దాడులకు ప్రణాళిక రచించినట్లు అధికారులు తెలిపారు.
ఇద్దరు ఉగ్రవాదులు ఐసిస్ ఉగ్రవాద సంస్థకు విధేయత చూపుతున్నట్లు ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. నిందితులిద్దరూ సిరియా సరిహద్దులో ఉన్నట్లు చెప్పుకునే హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని.. భారతదేశంలో ఐసిస్ తరపున పనిచేయడానికి వీరిద్దరిని నియమించినట్లుగా వర్గాలు తెలిపాయి. ఇద్దరిలో కూడా చాలా తీవ్రవాద భావాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. సిరియాకు చెందిన ఐసిస్ హ్యాండ్లర్ అబు ఇబ్రహీం అల్-ఖురేషితో నిరంతరం కమ్యూనికేషన్లో ఉన్నారని.. అతని సూచనల మేరకు ఢిల్లీలో భారీ కుట్రలకు ప్లాన్ చేసినట్లుగా అధికారులు తేల్చారు.
Also Read
- Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్రూమ్లో ఏడో తరగతి బాలుడి మృతి..
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
ఇది కూాడా చదవండి: Maharashtra: డాక్టర్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు.. ఓ ఎంపీ ఏం చేశాడంటే..!
ప్రాథమిక విచారణలో నిందితుల్లో ఒకడు కీలక విషయాలు వెల్లడించాడు. సోషల్ మీడియా ద్వారా భోపాల్కు చెందిన వ్యక్తితో సంప్రదింపులు జరిపినట్లు తెలిపాడు. జిహాదీ సిద్ధాంతాలను ఆన్లైన్ ద్వారా షేర్ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇద్దరు ఉగ్రవాదులు కూడా విద్యావంతులని.. సాధారణ జీవితాలను గడుపుతున్నారని అధికారులు వెల్లడించారు. స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్ వాడకంతో ఇద్దరు కూడా ఐసిస్కి ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దీపావళి సమయంలో ఢిల్లీ భారీ దాడులకు కుట్ర పన్నినట్లుగా కనుగొన్నారు. ఢిల్లీలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక ప్రముఖ మాల్ లేదా ఒక పబ్లిక్ పార్కును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడి చేయడానికి కుట్ర పన్నినట్లుగా విచారణలో తేలింది.
ఇది కూాడా చదవండి: Osama bin Laden: ఆ సమయంలో లాడెన్ ఆడ వేషంలో తప్పించుకున్నాడు.. మాజీ సీఐఏ అధికారి వెల్లడి
తాజావార్తలు
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Karan Johar : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్3కి కరణ్ జోహార్ ప్లాన్
-
Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
-
Japan Squad: భారత్తో చారిత్రాత్మక టీ20.. జపాన్ జట్టు ప్రకటన.. స్కూల్ క్రికెటర్లకు చోటు!
-
OTT Releases: ఓటీటీలో హాలీవుడ్ హవా.. ఈ వీకెండ్ వీటిని అస్సలు మిస్ చేయొద్దు
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!