Osama bin Laden: ఆ సమయంలో లాడెన్ ఆడ వేషంలో తప్పించుకున్నాడు.. మాజీ సీఐఏ అధికారి వెల్లడి
- ఆ సమయంలో లాడెన్ ఆడ వేషంలో తప్పించుకున్నాడు
- మాజీ సీఐఏ అధికారి జాన్ కిరియాకౌ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒసామా బిన్ లాడెన్.. అగ్ర రాజ్యం అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు మరిచిపోలేని పేరు. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అల్ఖైదా ఉగ్రవాదులు జరిగించిన మారణహోమంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్ర కుట్రకు సూత్రధారి అయిన లాడెన్ కోసం అమెరికా దళాలు అవిశ్రాంతిగా పోరాటం చేశాయి. ఎట్టకేలకు దశాబ్ద కాలం తర్వాత అనగా 2011, మే 2 అర్ధరాత్రి పాకిస్థాన్లో లాడెన్ను అమెరికా దళాలు అంతమొందించాయి.
ఈ ఆపరేషన్కు సంబంధించిన కీలక విషయాలను 15 ఏళ్ల పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్స్లో పని చేసిన మాజీ అధికారి జాన్ కిరియాకౌ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Also Read
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
- Modi-Trump: బెంగాల్లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్
సెప్టెంబర్ 11, 2001లో 19 మంది అల్ఖైదా ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్పై నాలుగు జట్లుగా విడిపోయి దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దాదాపు 3,000 వేల మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇది అమెరికా చరిత్రలోనే అతి పెద్ద ఉగ్రవాద చర్య. ప్రపంచ దేశాలను ఒక్కసారిగా షాక్కు గురి చేసింది.
ఇది కూడా చదవండి: Machado: వెనిజులా ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ.. నోబెల్ గ్రహీత మచాడో వెల్లడి
అనంతరం ఉగ్రవాదుల కోసం అమెరికా దళాలు వేట ప్రారంభించాయి. నెల రోజుల తర్వాత ఆప్ఘనిస్థాన్లో ఉగ్ర స్థావరాలను గుర్తించినట్లుగా జాన్ కిరియాకౌ తెలిపారు. ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి నెల రోజులు అవగాహన పెంచుకున్నట్లు చెప్పారు. ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని భావించామని.. అవగాహన వచ్చిన తర్వాత ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు వివరించారు. లాడెన్ను లొంగిపోవాలని ట్రాన్స్లేటర్ ద్వారా సందేశం పంపించామని.. అయితే పిల్లల్ని, మహిళలను తరలించడానికి ట్రాన్స్లేటర్ ద్వారా కొంత సమయం అడిగినట్లు తెలిపారు. అయితే ఆ ట్రాన్స్లేటర్ కూడా అల్ఖైదాకు చెందిన వాడని తర్వాత అర్థమైందని.. అతడు అమెరికా సైన్యంలోకి చొరబడిన అల్ ఖైదా కార్యకర్త అని జాన్ కిరియాకౌ చెప్పుకొచ్చారు. అయితే లాడెన్కు లొంగిపోయేందుకు సమయం ఇవ్వాలని ట్రాన్స్లేటర్ జనరల్ ఫ్రాంక్స్ను తీవ్రంగా ఒప్పించాడని.. దీంతో పారిపోయేందుకు లాడెన్కు సమయం దొరకగానే ఆడ వేషం వేసుకుని పికప్ ట్రక్కు వెనుక నక్కి పాకిస్థాన్లోకి పారిపోయాడని చెప్పుకొచ్చారు. దీంతో మా పోరాటం పాకిస్థాన్ వైపు మళ్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎట్టకేలకు దశాబ్ద కాలం తర్వాత అనగా 2011, మే 2న అర్ధరాత్రి అబోటాబాద్ శివారులో రహస్యంగా తలదాచుకున్న లాడెన్ను గుర్తించి అమెరికా దళాలు హతమార్చినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Delhi Encounter: ఢిల్లీలో మరో ఎన్కౌంటర్.. పోలీసుల అదుపులో నిందితుడు
ఇక 2001లో భారత పార్లమెంట్పై జరిగిన దాడితో అణ్వాయుధాలు కలిగిన భారత్-పాక్ యుద్ధానికి దిగుతాయని సీఐఏ భావించిందని జాన్ కిరియాకౌ గుర్తుచేసుకున్నారు. అయితే భారత్తో జరిగే ఎలాంటి యుద్ధంలో అయినా పాక్ ఓడిపోతుందని పేర్కొన్నారు. భారతీయులను నిరంతరం రెచ్చగొట్టడం వల్ల ఎలాంటి లాభం లేదని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్ కిరియాకౌ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
-
Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
-
Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
-
Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్
-
CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!