Amit Shah: ఆయన ముఖ్యమంత్రా..? కేజ్రీవాల్కి పైలెట్గా పనిచేస్తున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా మారుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. పంజాబ్ గురుదాస్ పూర్ పర్యటనలో ఉన్న ఆయన ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ను టార్గెట్ చేశారు. భగవంత్ మాన్ రాష్ట్రానికి సమయాన్ని కేటాయించడం లేదని, అరవింద్ కేజ్రీవాల్ దేశ పర్యటనలకు రాష్ట్రవిమానాన్ని తీసుకెళ్లడమే పనిగా పెట్టుకున్నాడని ఆదివారం అన్నారు. ఆయన ముఖ్యమంత్రా..? లేక పోలే కేజ్రీవాల్ పైలెటా..? అని ప్రశ్నించారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి ప్రచారంలో భాగంగా పంజాబ్లోని గురుదాస్ పూర్ లో జరిగిన ర్యాలీలో షా పాల్గొన్నారు. నా మొత్తం జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదని, ఆప్ తప్పుడు హామీలు ఇస్తోందని విమర్శించారు. కేజ్రీవాల్ చెన్నై వెళ్తే అక్కడికి, కోల్కతాకు వెళ్లవలసి వస్తే అక్కడికి విమానాన్ని తీసుకెళ్లడమే భగవంత్ మాన్ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ పర్యటనకే మొత్తం రాష్ట్ర ఖజానా ఖర్చవుతోందని దుయ్యబట్టారు. పంజాబ్ శాంతిభద్రతలు ప్రమాదకరంగా మారాయని, ఇక్కడి ప్రజలు సురక్షితంగా లేరని అమిత్ షా అన్నారు.
Also Read
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
Read Also: Money Laundering Case: 400 కోట్ల మనీలాండరింగ్ కేసులో అన్నదమ్ములిద్దరూ అరెస్ట్..!
పంజాబ్ లో డ్రగ్స్ వ్యాపారం పెరుగుతోందని, రైతుల సమస్యలు పట్టించుకునే సమయం సీఎంకు లేదని అన్నారు. ఆప్ ప్రభుత్వం పంజాబ్ లో ప్రతీ మహిళకు రూ. 1000 ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని అన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని ముప్పు నుంచి విముక్తి చేయాలని నిర్ణయించిందని, త్వరలో పంజాబ్లో మాదకద్రవ్యాల వ్యాపారానికి తెరపడుతుందని అన్నారు. నెల రోజుల్లో అమృత్సర్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లో 300 కంటే ఎక్కువ సీట్లతో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకోవాలని, ప్రధాని మోదీని మళ్లీ ప్రధానిని చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేజ్రీవాల్ రాజకీయాలను ముందుకు తీసుకెళ్లడం, దేశవ్యాప్తంగా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారని అమిత్ షా ఎద్దేవా చేశారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వం వార్తా పత్రికల్లో ప్రకటనలివ్వడాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ.. పంజాబ్ నిధులతో గుజరాత్, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రకటనలు ఇవ్వడం ఏంటని ఆయన నిలదీశారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, బీజేపీ నేతలు విజయ్ రూపానీ, మన్ ప్రీత్ సింగ్ బాదల్, సునీల్ జాఖర్, అశ్వనీ శర్మ, మనోరంజన్ కాలియా తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
-
Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!