Tariff Cuts: అమెరికా టారిఫ్ వార్.. భారత్ సంచలన వ్యాఖ్యలు..
- డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్..
- ఇండియా సుంకాలు తగ్గించుకుంటుందని ట్రంప్ కామెంట్స్..
- ఇంకా అమెరికాకు కమిట్మెంట్ ఇవ్వలేదని భారత్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tariff Cuts: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ‘‘పరస్పర సుంకాలు’’, సుంకాల పెంపుపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధించారు. ఇండియాపై కూడా టారిఫ్స్ విధిస్తామని చెప్పారు. అయితే, ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ తన సుంకాలను చాలా వరకు తగ్గించుకుంటుందని వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని రోజలు తర్వాత, అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించడానికి కట్టుబడి లేమని భారత్ చెబుతోంది.
అమెరికాతో అనేక దేశాలు అన్యాయమైన పద్ధతులు పాటిస్తున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. భారత్తో సహా అనేక దేశాలకు పరస్పర సుంకాలు వచ్చే నెల నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించారు. గత వారం మరోసారి ట్రంప్ భారత్ భారీ సుంకాలను విమర్శించారు. ‘‘మీరు భారత్లో ఏదీ అమ్మలేదు, అమెరికా ఉత్పత్తుల అమ్మకాలు దాదాపుగా పరిమితం చేయబడ్డాయి.’’ అన్నారు. కానీ వారు ఇప్పుడు సుంకాలు తగ్గించుకోవాలని కోరుకుంటున్నారని, ఎందుకంటే వారు ఇన్నాళ్లు చేసింది బహిర్గమైందని ట్రంప్ అన్నారు.
Also Read
- Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
- Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
Read Also: Shekar Master : బూతు స్టెప్పులకు బ్రాండ్ అంబాసిడర్ గా శేఖర్ మాస్టర్ ?
అయితే, భారత ప్రభుత్వం పార్లమెంటరీ ప్యానెల్కి ‘‘ఈ అంశంపై అమెరికాకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదని’’ జాతీయ మీడియా ఒక నివేదికలో తెలిపింది. అమెరికన్ అధ్యక్షుడు పదే పదే లేవనెత్తుతున్న సమస్యల్ని పరిష్కరించడానికి సెప్టెంబర్ వరకు సమయం కోరినట్లు చెప్పింది.
భారతదేశం , యుఎస్ పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం పనిచేస్తున్నాయని, తక్షణ సుంకాల సర్దుబాట్లను కోరుతూ కాకుండా దీర్ఘకాలిక వాణిజ్య సహకారంపై దృష్టి సారించాయని” భారత వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్త్వాల్ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద, ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు మధ్య త్వరలో కుదిరే పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందంపై పనిచస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గత నెలలో వైట్ హౌజ్లో ట్రంప్తో మోడీ భేటీ అయ్యారు.
తాజావార్తలు
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
-
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
-
New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!