యూరప్, పశ్చిమ దేశాలు భారత్ తో గౌరవప్రదమైన, సహకార విధానాన్ని అవలంబించాలని, లేకుంటే మనమందరం ప్రపంచ ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ స్పష్టం చేశారు. భారతదేశంపై విధించిన సుంకాలపై కూడా ఆయన పరోక్షంగా ట్రంప్ను విమర్శించారు. లిథువేనియా అధ్యక్షుడు గీతానాస్ నౌసేడాతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో స్టబ్ మాట్లాడుతూ, షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం గ్లోబల్ సౌత్ శక్తి గురించి పశ్చిమ దేశాలను హెచ్చరించిందని అన్నారు.…
అదనపు సుంకాలు లేదా సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నప్పటికీ, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును భారత్ ఆపదని దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చైర్మన్ ఎఎస్ సాహ్నీ గురువారం తెలిపారు. ఐఓసీ వంటి శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయడం పూర్తిగా ఆర్థిక అంశాలను దృష్టిలో ఉంచుకుంటాయని సాహ్ని అన్నారు. రష్యన్ కొనుగోళ్లపై ఎటువంటి నిషేధం లేదని, మేము కొనుగోళ్లను కొనసాగిస్తున్నామన్నారు.…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో కఠినమైన సుంకాల విధానాన్ని ప్రకటించారు. అనేక దేశాలతో వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా వెలుపల ఐఫోన్లను తయారు చేస్తే 25 శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ ఆపిల్ను హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి కొత్త ప్రకటన వెలువడింది. దేశీయంగా యుద్ధ ట్యాంకులు, సాంకేతిక ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడమే తన టారిఫ్ విధానం అని ఆయన స్పష్టంగా…
US India trade deal: అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల అధికారులు విస్తృతంగా పనిచేస్తున్నారు. ట్రంప్ ‘‘పరస్పర సుంకాల’’ నిర్ణయంతో భారత్ అమెరికాతో ట్రేడ్ డీల్కి ప్రాధాన్యత ఇస్తోంది. ఇదిలా ఉంటే.. అమెజాన్, వాల్మార్ట్ వంటి ఆన్లైన్ రిటైలర్లకు భారత మార్కెట్లో పూర్తి ప్రవేశాన్ని ఇవ్వాలని మన దేశంపై అమెరికా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్, లాబీయిస్టులు, యూఎస్ ప్రభుత్వ అధికారుల్ని ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ మంగళవారం…
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. రెండు అతి పెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మధ్య టిట్-ఫర్-టాట్ టారిఫ్ వార్ కొనసాగుతుంది.. ఇకపై ఏదీ పూర్తిగా వ్యాపారం కాదు.. ప్రతిదీ కూడా వ్యక్తిగతమైనదని అన్నారు.
Tariff cuts: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుంకాల పేరుతో భయపెడుతున్నారు. ఇప్పటికే మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై టారిఫ్స్ విధించాడు. ఇండియా కూడా తమ ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తోందని బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు తమతమ ఉత్పత్తులపై సుంకాల విధింపును పరిశీలిస్తున్నాయి. రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా 23 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతుల్లో సగానికి పైగా సుంకాలు తగ్గించడానికి భారత్…
Tariff Cuts: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ‘‘పరస్పర సుంకాలు’’, సుంకాల పెంపుపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధించారు. ఇండియాపై కూడా టారిఫ్స్ విధిస్తామని చెప్పారు. అయితే, ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ తన సుంకాలను చాలా వరకు తగ్గించుకుంటుందని వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని రోజలు తర్వాత, అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించడానికి కట్టుబడి లేమని భారత్ చెబుతోంది.