US Report: భారత ప్రథమ శత్రువు చైనా, తర్వాతి స్థానంలో పాకిస్తాన్.. యూఎస్ రిపోర్ట్..
- అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో సంచలన విషయాలు..
- భారత ప్రాథమిక విరోధి చైనా, తర్వాత స్థానంలో పాకిస్తాన్..
- భారత్-రష్యాతో తన స్నేహాన్ని కొనసాగిస్తుంది..
- భారత్ టార్గెట్గా పాక్ అణ్వాయుధాల ఆధునీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Report: యూఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ-2025, వరల్డ్ వైడ్ త్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ని విడుదల చేసింది. ఈ నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. పాకిస్తాన్ తన అస్తిత్వానికి ముప్పుగా భారత్ని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మిలిటరీ ఆధిక్యతను తట్టుకునేందుకు పాకిస్తాన్, చైనా సాయంతో తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని నివేదిక వెల్లడించింది. ఇటీవల, ఆపరేషన్ సిందూర్లో భారత్ సత్తా చాటింది. పాకిస్తాన్ సైన్యాన్ని కాళ్ల బేరానికి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నివేదిక అంశాలు సంచలనంగా మారాయి.
ఇదిలా ఉంటే, భారత్ మాత్రం తన ప్రథమ శత్రువుగా చైనాను భావిస్తోంది, ఆ తర్వాతే పాకిస్తాన్ని ముప్పుగా పరిగణిస్తోంది. చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి, ప్రపంచ నాయకత్వ పాత్రను పెంచుకోవడానికి భారతదేశం హిందూ మహాసముద్ర ప్రాంతంలో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇస్తోందని నివేదిక హైలెట్ చేసింది. భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని ప్రస్తావిస్తూ.. సరిహద్దు వివాదాలను పరిష్కరించలేదు, కానీ 2020 గల్వాన్ ఘర్షణ నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలు కొంత తగ్గాయని చెప్పింది.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
Read Also: NDA: ప్రధాని మోడీ, భారత సైన్యాన్ని అభినందిస్తూ ఎన్డీయే తీర్మానం..
“భారతదేశం తన దేశీయ రక్షణ పరిశ్రమను నిర్మించడానికి, సరఫరా గొలుసు సమస్యలను తగ్గించడానికి మరియు దాని మిలిటరీని ఆధునీకరించడానికి ఈ సంవత్సరం తన “మేడ్ ఇన్ ఇండియా” చొరవను దాదాపుగా కొనసాగిస్తుంది. భారతదేశం 2024 లో తన మిలిటరీని ఆధునీకరించడం కొనసాగించింది, అణు సామర్థ్యం గల అభివృద్ధి అగ్ని-I ప్రైమ్ MRBM, అగ్ని-V మల్టిపుల్ ఇండిపెండెంటబుల్ టార్గెటెబుల్ రీఎంట్రీ వెహికిల్ పరీక్షను నిర్వహించింది, అదే సమయంలో దాని అణు త్రయాన్ని బలోపేతం చేయడానికి, ప్రత్యర్థులను అరికట్టే సామర్థ్యాన్ని పెంచడానికి దాని రెండవ అణుశక్తితో నడిచే జలాంతర్గామిని కూడా ప్రారంభించింది” అని నివేదిక తెలిపింది.
భారత్-రష్యాతో తన సంబంధాలను కొనసాగిస్తుందని నివేదిక స్పష్టం చేసింది. రష్యాతో తన సంబంధాలను తన ఆర్థిక, రక్షణ లక్ష్యాలను సాధించడానికి ముఖ్యమైందిగా భారత్ భావిస్తోందని నివేదిక తెలిపింది. మోడీ పాలనలో భారత్ రష్యా నుంచి సైనిక పరికరాల కొనుగోలును తగ్గించింది, కానీ చైనా, పాక్ నుంచి వచ్చు ముప్పులను ఎదుర్కోవడానికి, భారత్ తన సైనిక సామర్థ్యాలను వెన్నెముకగా నిలిచే రష్యన్ ట్యాంకులు, యుద్ధ విమానాలను నిర్వహించడానికి ఇప్పటికీ రష్యన్ విడిభాగాల ఆధారపడుతుంది అని పేర్కొంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..