US Report: భారత ప్రథమ శత్రువు చైనా, తర్వాతి స్థానంలో పాకిస్తాన్.. యూఎస్ రిపోర్ట్..
- అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో సంచలన విషయాలు..
- భారత ప్రాథమిక విరోధి చైనా, తర్వాత స్థానంలో పాకిస్తాన్..
- భారత్-రష్యాతో తన స్నేహాన్ని కొనసాగిస్తుంది..
- భారత్ టార్గెట్గా పాక్ అణ్వాయుధాల ఆధునీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Report: యూఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ-2025, వరల్డ్ వైడ్ త్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ని విడుదల చేసింది. ఈ నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. పాకిస్తాన్ తన అస్తిత్వానికి ముప్పుగా భారత్ని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మిలిటరీ ఆధిక్యతను తట్టుకునేందుకు పాకిస్తాన్, చైనా సాయంతో తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని నివేదిక వెల్లడించింది. ఇటీవల, ఆపరేషన్ సిందూర్లో భారత్ సత్తా చాటింది. పాకిస్తాన్ సైన్యాన్ని కాళ్ల బేరానికి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నివేదిక అంశాలు సంచలనంగా మారాయి.
ఇదిలా ఉంటే, భారత్ మాత్రం తన ప్రథమ శత్రువుగా చైనాను భావిస్తోంది, ఆ తర్వాతే పాకిస్తాన్ని ముప్పుగా పరిగణిస్తోంది. చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి, ప్రపంచ నాయకత్వ పాత్రను పెంచుకోవడానికి భారతదేశం హిందూ మహాసముద్ర ప్రాంతంలో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇస్తోందని నివేదిక హైలెట్ చేసింది. భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని ప్రస్తావిస్తూ.. సరిహద్దు వివాదాలను పరిష్కరించలేదు, కానీ 2020 గల్వాన్ ఘర్షణ నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలు కొంత తగ్గాయని చెప్పింది.
Also Read
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
Read Also: NDA: ప్రధాని మోడీ, భారత సైన్యాన్ని అభినందిస్తూ ఎన్డీయే తీర్మానం..
“భారతదేశం తన దేశీయ రక్షణ పరిశ్రమను నిర్మించడానికి, సరఫరా గొలుసు సమస్యలను తగ్గించడానికి మరియు దాని మిలిటరీని ఆధునీకరించడానికి ఈ సంవత్సరం తన “మేడ్ ఇన్ ఇండియా” చొరవను దాదాపుగా కొనసాగిస్తుంది. భారతదేశం 2024 లో తన మిలిటరీని ఆధునీకరించడం కొనసాగించింది, అణు సామర్థ్యం గల అభివృద్ధి అగ్ని-I ప్రైమ్ MRBM, అగ్ని-V మల్టిపుల్ ఇండిపెండెంటబుల్ టార్గెటెబుల్ రీఎంట్రీ వెహికిల్ పరీక్షను నిర్వహించింది, అదే సమయంలో దాని అణు త్రయాన్ని బలోపేతం చేయడానికి, ప్రత్యర్థులను అరికట్టే సామర్థ్యాన్ని పెంచడానికి దాని రెండవ అణుశక్తితో నడిచే జలాంతర్గామిని కూడా ప్రారంభించింది” అని నివేదిక తెలిపింది.
భారత్-రష్యాతో తన సంబంధాలను కొనసాగిస్తుందని నివేదిక స్పష్టం చేసింది. రష్యాతో తన సంబంధాలను తన ఆర్థిక, రక్షణ లక్ష్యాలను సాధించడానికి ముఖ్యమైందిగా భారత్ భావిస్తోందని నివేదిక తెలిపింది. మోడీ పాలనలో భారత్ రష్యా నుంచి సైనిక పరికరాల కొనుగోలును తగ్గించింది, కానీ చైనా, పాక్ నుంచి వచ్చు ముప్పులను ఎదుర్కోవడానికి, భారత్ తన సైనిక సామర్థ్యాలను వెన్నెముకగా నిలిచే రష్యన్ ట్యాంకులు, యుద్ధ విమానాలను నిర్వహించడానికి ఇప్పటికీ రష్యన్ విడిభాగాల ఆధారపడుతుంది అని పేర్కొంది.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!