US Report: భారత ప్రథమ శత్రువు చైనా, తర్వాతి స్థానంలో పాకిస్తాన్.. యూఎస్ రిపోర్ట్..
- అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో సంచలన విషయాలు..
- భారత ప్రాథమిక విరోధి చైనా, తర్వాత స్థానంలో పాకిస్తాన్..
- భారత్-రష్యాతో తన స్నేహాన్ని కొనసాగిస్తుంది..
- భారత్ టార్గెట్గా పాక్ అణ్వాయుధాల ఆధునీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Report: యూఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ-2025, వరల్డ్ వైడ్ త్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ని విడుదల చేసింది. ఈ నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. పాకిస్తాన్ తన అస్తిత్వానికి ముప్పుగా భారత్ని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మిలిటరీ ఆధిక్యతను తట్టుకునేందుకు పాకిస్తాన్, చైనా సాయంతో తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని నివేదిక వెల్లడించింది. ఇటీవల, ఆపరేషన్ సిందూర్లో భారత్ సత్తా చాటింది. పాకిస్తాన్ సైన్యాన్ని కాళ్ల బేరానికి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నివేదిక అంశాలు సంచలనంగా మారాయి.
ఇదిలా ఉంటే, భారత్ మాత్రం తన ప్రథమ శత్రువుగా చైనాను భావిస్తోంది, ఆ తర్వాతే పాకిస్తాన్ని ముప్పుగా పరిగణిస్తోంది. చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి, ప్రపంచ నాయకత్వ పాత్రను పెంచుకోవడానికి భారతదేశం హిందూ మహాసముద్ర ప్రాంతంలో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇస్తోందని నివేదిక హైలెట్ చేసింది. భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని ప్రస్తావిస్తూ.. సరిహద్దు వివాదాలను పరిష్కరించలేదు, కానీ 2020 గల్వాన్ ఘర్షణ నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలు కొంత తగ్గాయని చెప్పింది.
Also Read
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
Read Also: NDA: ప్రధాని మోడీ, భారత సైన్యాన్ని అభినందిస్తూ ఎన్డీయే తీర్మానం..
“భారతదేశం తన దేశీయ రక్షణ పరిశ్రమను నిర్మించడానికి, సరఫరా గొలుసు సమస్యలను తగ్గించడానికి మరియు దాని మిలిటరీని ఆధునీకరించడానికి ఈ సంవత్సరం తన “మేడ్ ఇన్ ఇండియా” చొరవను దాదాపుగా కొనసాగిస్తుంది. భారతదేశం 2024 లో తన మిలిటరీని ఆధునీకరించడం కొనసాగించింది, అణు సామర్థ్యం గల అభివృద్ధి అగ్ని-I ప్రైమ్ MRBM, అగ్ని-V మల్టిపుల్ ఇండిపెండెంటబుల్ టార్గెటెబుల్ రీఎంట్రీ వెహికిల్ పరీక్షను నిర్వహించింది, అదే సమయంలో దాని అణు త్రయాన్ని బలోపేతం చేయడానికి, ప్రత్యర్థులను అరికట్టే సామర్థ్యాన్ని పెంచడానికి దాని రెండవ అణుశక్తితో నడిచే జలాంతర్గామిని కూడా ప్రారంభించింది” అని నివేదిక తెలిపింది.
భారత్-రష్యాతో తన సంబంధాలను కొనసాగిస్తుందని నివేదిక స్పష్టం చేసింది. రష్యాతో తన సంబంధాలను తన ఆర్థిక, రక్షణ లక్ష్యాలను సాధించడానికి ముఖ్యమైందిగా భారత్ భావిస్తోందని నివేదిక తెలిపింది. మోడీ పాలనలో భారత్ రష్యా నుంచి సైనిక పరికరాల కొనుగోలును తగ్గించింది, కానీ చైనా, పాక్ నుంచి వచ్చు ముప్పులను ఎదుర్కోవడానికి, భారత్ తన సైనిక సామర్థ్యాలను వెన్నెముకగా నిలిచే రష్యన్ ట్యాంకులు, యుద్ధ విమానాలను నిర్వహించడానికి ఇప్పటికీ రష్యన్ విడిభాగాల ఆధారపడుతుంది అని పేర్కొంది.
తాజావార్తలు
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Slum Dog Release : పూరీ జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ సినిమా థియేట్రికల్ రైట్స్ కొనేదెవరు?
-
TG20 తొలి ఛాంపియన్గా ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
-
Israel General Election 2026: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు.. గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుకు కీలక పరీక్ష
-
Maa Inti Bangaram OTT: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!