PakIstan: భారత్ టార్గెట్గా అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న పాకిస్తాన్.. యూఎస్ రిపోర్ట్..
- అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న పాకిస్తాన్..
- అందుకు సహకరిస్తున్న చైనా..
- అమెరికా ఇంటెల్ రిపోర్టులో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PakIstan: పాకిస్తాన్ తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. తాజా వరల్డ్ థ్రెట్ అసెస్మెంట్ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ తన అణ్వాయుధాలను చైనా నుండి సైనిక, ఆర్థిక మద్దతుతో ఆధునీకరిస్తోందని వెల్లడించింది. భారతదేశాన్ని అస్తిత్వ ముప్పుగా భావిస్తోందని చెప్పింది. పాకిస్తాన్ సైన్యం ప్రాధాన్యతలో ప్రాంతీయ పొరుగు దేశాలతో సరిహద్దు ఘర్షణలు, అణ్వాయుధాల నిరంతర ఆధునీకరణ వంటి లక్ష్యాలు ఉండొచ్చని నివేదిక తెలిపింది.
Read Also: Sardar 2 : కార్తీ బర్త్ డే స్పెషల్.. ‘సర్ధార్ 2’ నుండి పవర్ ఫల్ పోస్టర్ రిలీజ్
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
‘‘పాకిస్తాన్ భారతదేశాన్ని అస్తిత్వ ముప్పుగా భావిస్తుంది, భారతదేశం సాంప్రదాయ సైనిక ఆధిక్యతను భర్తీ చేయడానికి, బ్యాటిల్ ఫీల్డ్ అణ్వాయుధాల అభివృద్ధితో సహా దాని సైనిక ఆధునీకరణ ప్రయత్నాలను కొనసాగిస్తుంది’’ అని నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ తన అణ్వాయుధాలను ఆధునీకరించడంతో పాటు అణ్వాయుధ పదార్థాల భద్రత, అణు నియంత్రణను కొనసాగిస్తోందని, పాకిస్తాన్ దాదాపుగా విదేశీ సరఫరాదారులు, మధ్యవర్తుల నుంచి సామూహిక విధ్వంసక ఆయుధాలు(Weapons of Mass Destruction) వర్తించే వస్తువులను కొనుగోలు చేస్తోందని నివేదిక తెలిపింది.
ఇటీవల, ఆపరేషన్ సిందూర్లో భారత్ తన ఆధిక్యతను స్పష్టంగా కనబరిచింది. పాకిస్తాన్ క్షిపణులను, డ్రోన్లను నేలకూల్చడమే కాకుండా, పాక్ వైమానిక స్థావరాల్లో 11 స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ తన 20 శాతం వైమానిక ఆస్తుల్ని కోల్పో్యినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, యూఎస్ నివేదిక రావడం గమనార్హం.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!