Congress: ఏడాదిలోగా దేశంలో పార్లమెంట్ ఎన్నికలు.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: లోక్సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2014, 2019లో స్వయంగా మెజారిటీ మార్క్(272) సీట్లకు పైగా బీజేపీ గెలుచుకుంటే, 2024లో మాత్రం మెజారిటీ మార్కుకి దాదాపుగా 30 సీట్ల దూరంలో 240 సీట్లను గెలుచుకుంది. అయితే ఎన్డీయే కూటమిగా 293 సీట్లను సాధించింది. దీంతో మళ్లీ మోడీ అధికారం చేపట్టడానికి మార్గం సుగమం అయింది. తెలుగుదేశం, జేడీయూ, శివసేన వంటి ఎన్డీయే పార్టీలు ప్రధాని మోడీకి సంపూర్ణ మద్దతును తెలియజేశాయి. ఎన్డీయే పక్షనేతగా ఎన్నుకున్నాయి. ఈ నెల 9న మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేత, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆరు నెలల నుంచి ఏడాది మధ్య పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలు నరేంద్ర మోడీని తమ నాయకుడిగా మరియు తదుపరి ప్రధానమంత్రిగా ఎంచుకున్న రోజున బఘేల్ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్లో బీజేపీ క్లీన్ స్వీప్!
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
Read Also: Barathiyudu 2: ‘తాత వస్తాడే.. అదరగొట్టి పోతాడే..’ భారతీయుడు 2 నుండి మరోపాట విడుదల..
ఓ బహిరంగ సమావేశంలో బఘేల్ మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అతని రాజస్థాన్ కౌంటర్ భజన్ లాల్ శర్మ మరియు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లపై కూడా విరుచుకుపడ్డారు.యోగి కుర్చీ వణుకుతోందని, భజన్ లాల్ ఊగిసలాడుతున్నారని, ఫడ్నవీస్ కూడా రాజీనామా చేస్తున్నారని చెప్పారు.
బీజేపీకి స్వతహాగా మెజారిటీ రాకపోవడం, ఇతర ఎన్డీయే మిత్ర పక్షాలపై ఆధారపడి ఉండటంతో, ఎప్పుడైనా ప్రభుత్వం కూలిపోవచ్చని ఇండియా కూటమి పార్టీలు భావిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వంటి వారు మద్దతు ఉపసంహరించుకుంటే ఎన్డీయే ప్రభుత్వం ఉండదని కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!