Congress: ఏడాదిలోగా దేశంలో పార్లమెంట్ ఎన్నికలు.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: లోక్సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2014, 2019లో స్వయంగా మెజారిటీ మార్క్(272) సీట్లకు పైగా బీజేపీ గెలుచుకుంటే, 2024లో మాత్రం మెజారిటీ మార్కుకి దాదాపుగా 30 సీట్ల దూరంలో 240 సీట్లను గెలుచుకుంది. అయితే ఎన్డీయే కూటమిగా 293 సీట్లను సాధించింది. దీంతో మళ్లీ మోడీ అధికారం చేపట్టడానికి మార్గం సుగమం అయింది. తెలుగుదేశం, జేడీయూ, శివసేన వంటి ఎన్డీయే పార్టీలు ప్రధాని మోడీకి సంపూర్ణ మద్దతును తెలియజేశాయి. ఎన్డీయే పక్షనేతగా ఎన్నుకున్నాయి. ఈ నెల 9న మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేత, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆరు నెలల నుంచి ఏడాది మధ్య పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలు నరేంద్ర మోడీని తమ నాయకుడిగా మరియు తదుపరి ప్రధానమంత్రిగా ఎంచుకున్న రోజున బఘేల్ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Karnataka: ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం.. పోలీసుల గాలింపు
- Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
- Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
- 1984 Anti-Sikh Riots: "సజ్జన్ కుమార్ హీరోనా.?" రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని సిక్కుల ఆందోళన..
Read Also: Barathiyudu 2: ‘తాత వస్తాడే.. అదరగొట్టి పోతాడే..’ భారతీయుడు 2 నుండి మరోపాట విడుదల..
ఓ బహిరంగ సమావేశంలో బఘేల్ మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అతని రాజస్థాన్ కౌంటర్ భజన్ లాల్ శర్మ మరియు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లపై కూడా విరుచుకుపడ్డారు.యోగి కుర్చీ వణుకుతోందని, భజన్ లాల్ ఊగిసలాడుతున్నారని, ఫడ్నవీస్ కూడా రాజీనామా చేస్తున్నారని చెప్పారు.
బీజేపీకి స్వతహాగా మెజారిటీ రాకపోవడం, ఇతర ఎన్డీయే మిత్ర పక్షాలపై ఆధారపడి ఉండటంతో, ఎప్పుడైనా ప్రభుత్వం కూలిపోవచ్చని ఇండియా కూటమి పార్టీలు భావిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వంటి వారు మద్దతు ఉపసంహరించుకుంటే ఎన్డీయే ప్రభుత్వం ఉండదని కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Karnataka: ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం.. పోలీసుల గాలింపు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
-
Cheque Book New Rules 2026: చెక్బుక్ కొత్త రూల్స్.. మీ చెక్పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
-
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!