NEET Controversy: “రాజీనామాతో నా కూతురు తిరిగి రాదు.. దోషులను ఉరి తీయండి”.. నీట్ బాధితురాలి తల్లి ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Controversy: ఏ నిర్ణయం కూడా తన కూతురిని తిరిగి తీసుకురా లేదని.. కానీ న్యాయం జరుగుతుందనే తాను ఎదురు చూస్తున్నానని ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థిని తల్లి తెలిపారు. నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన దోషులకు ఉరిశిక్ష మాత్రమే సరైన శిక్ష ఆ తల్లి ఆవేదనతో డిమాండ్ చేసింది. విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ, దానివల్ల తమకేం ఒరుగుతుందని మాతృమూర్తి నీలం చతుర్వేది ప్రశ్నించారు. పేపర్ లీక్కు కారణమైన అసలు దోషులను ఉరితీయాలని ఆమె పట్టుబట్టారు. ఆమె కుమార్తె ఆకాంక్ష చతుర్వేది (18) ఈ ఏడాది మే 20న నాగ్పూర్లో ఆత్మహత్యకు పాల్పడింది. నీట్ పరీక్ష రద్దు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆకాంక్ష, “మరోసారి పరీక్ష రాసే ధైర్యం నాకు లేదు” అని సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది.
తన కుమార్తె మరణంపై స్పందిస్తూ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమకు సంతృప్తి లభించలేదని, కేవలం రాజీనామాతో బాధ్యత ముగిసిపోదని నీలం వ్యాఖ్యానించారు. విద్యార్థులు చేస్తున్న పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నామని, పేపర్ లీక్తో లక్షలాది మంది భవిష్యత్తుతో ఆడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, వారికి మరణశిక్ష విధించాలని కోరారు. మధ్యప్రదేశ్కు చెందిన ఆకాంక్ష కుటుంబం, నీట్ కోచింగ్ కోసం నాగ్పూర్ వెళ్లింది. మే 3న జరిగిన పరీక్షను ఎంతో బాగా రాశానని, 650కి పైగా మార్కులు వస్తాయని ఆకాంక్ష కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ లీకేజీ కారణంగా పరీక్ష రద్దు కావడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. తినడం, మాట్లాడటం మానేసి డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆమె తండ్రి చిన్న కమతంలో వ్యవసాయం చేస్తూ, నాగ్పూర్లో వంటమనిషిగా పనిచేస్తూ కూతురి చదువు కోసం అప్పులు చేశారు. ప్రస్తుతం ఆయన రెండుసార్లు గుండెపోటుకు గురై, పక్షవాతంతో బాధపడుతున్నారు. “అమ్మా నాన్న, మీ కూతురు బాగా చదివి డాక్టర్ అవుతుందని మీరు నమ్మారు. కానీ నాకు మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం లేదు. మొదటి ప్రయత్నంలో మంచి మార్కులు వచ్చేవి, కానీ ఇప్పుడు మళ్లీ అంత బాగా రాస్తాననే గ్యారెంటీ లేదు. నన్ను క్షమించండి అమ్మా నాన్న.. నేను అంతా పాడుచేశాను” అని ఆకాంక్ష తన సూసైడ్ నోట్లో రాసిన భావోద్వేగ మాటలు ఆ తల్లిదండ్రులను కుంగదీస్తున్నాయి. తన కూతురు బతికి ఉంటే కుటుంబాన్ని నిలబెట్టేదని, ఇప్పుడు తమను ఎవరు చూసుకుంటారంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది.
Also Read
- Rajnath Singh: భారత్ డేటా సెంటర్లు నిర్మిస్తే.. పాకిస్థాన్ ఉగ్రవాద కేంద్రాలు నిర్మిస్తోంది..
- CM Chandrababu: మళ్లీ కూటమికి అధికారం ఖాయం.. కానీ..!
- Dharmendra Pradhan: షాకింగ్.. రెండు సార్లు రాజీనామా చేయడానికి ముందుకు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ కానీ..
- BTech Fees 2026: ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీటెక్ కనీస వార్షిక ఫీజు రూ.47 వేలు!
తాజావార్తలు
-
NEET Controversy: “రాజీనామాతో నా కూతురు తిరిగి రాదు.. దోషులను ఉరి తీయండి”.. నీట్ బాధితురాలి తల్లి ఆవేదన..
-
Rajnath Singh: భారత్ డేటా సెంటర్లు నిర్మిస్తే.. పాకిస్థాన్ ఉగ్రవాద కేంద్రాలు నిర్మిస్తోంది..
-
Srinivasa Mangapuram: జూలై 30న హిట్ కొడుతున్నాం.. కాన్ఫిడెంట్గా ‘శ్రీనివాస మంగాపురం’ టీమ్.. జయకృష్ణ నటనపై ప్రశంసలు
-
CM Chandrababu: మళ్లీ కూటమికి అధికారం ఖాయం.. కానీ..!
-
Lenovo Legion 27-1R: 27- ఇంచెస్ డిస్ప్లే, 280Hz రిఫ్రెష్ రేట్తో.. లెనోవో బడ్జెట్ గేమింగ్ మానిటర్ విడుదల.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..