Trump-Modi: ఈనెల 23 నుంచి సుంకాలపై భారత్-అమెరికా మధ్య కీలక చర్చలు
- వాణిజ్య యుద్ధంపై భారత్-అమెరికా మధ్య కీలక చర్చలు
- ఈనెల 23 నుంచి చర్చలు జరపనున్న ఇరు దేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అన్ని దేశాల నుంచి, ఆర్థిక నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ట్రంప్ వెనుకడుగు వేశారు. దాదాపు 90 రోజుల పాటు సుంకాలను వాయిదా వేశారు.
ఇది కూడా చదవండి: Samantha: డేట్ చేస్తున్న డైరెక్టర్తో తిరుమలకి సమంత?
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
ఇదిలా ఉంటే అమెరికాతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో సుంకాలపై ట్రంప్తో మోడీ చర్చలు కూడా జరిపారు. ఇరువురి మధ్య సానుకూల వాతావరణం నెలకొన్నట్లుగా ఆ మధ్య ప్రెస్మీట్లో ట్రంప్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈనెల 23న ఇదే అంశంపై ఇరు దేశాలు చర్చించనున్నారు. దాదాపు 19 ఒప్పందాలకు సంబంధించిన అంశలపై నిబంధనలు ఖరారయ్యాయి. ఈనెల 23 నుంచి వాషింగ్టన్తో భారత్ చర్చలు ఉంటాయని వర్గాలు పేర్కొన్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యా్ని 500 బిలియన్లకు పెంచే ఆలోచనతో ఇరు దేశాలు ఉన్నట్లు సమాచారం. ఇరు దేశాల చర్చలు చాలా సానుకూలంగా ఉండే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: GT vs DC: వాహ్.. ఢిల్లీ బ్యాటర్ల సమష్టి కృషి.. .. గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 204
ఒప్పందంలో వస్తువుల వాణిజ్యం, సేవలు, పెట్టుబడులు, కస్టమ్స్ విధానాలు వంటి వివధ రంగాలకు సంబంధించి దాదాపు 19 విభాగాలు ఉండనున్నాయి. చర్చల కోసం భారత్ నుంచి సీనియర్ ప్రతినిధి బృందం వచ్చే వారం వాషింగ్టన్కు వెళ్లనున్నట్లు సమాచారం. అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి భారత ప్రతినిధి బృందం వెళ్లనుంది. ఏప్రిల్ 23 నుంచి వాషింగ్టన్లో మూడు రోజుల వ్యక్తిగత వాణిజ్య చర్చలు ఉండనున్నాయి.
వాణిజ్య ఒప్పందంలో ఎలక్ట్రిక్ వాహనాలు, కొన్ని పారిశ్రామిక వస్తువులు, వైన్లు, పాడి, పెట్రోకెమికల్స్, ఆపిల్స్, అల్ఫాల్ఫా ఎండుగడ్డి, చెట్టు గింజలు వంటి ఉత్పత్తులకు అమెరికా సుంకాలు తగ్గించే ఛాన్సుంది. అలాగే భారతదేశం కూడా వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు వస్తువులు, రసాయనాలు, ప్లాస్టిక్లు, రొయ్యలు, నూనెగింజలు, ఉద్యానవన ఉత్పత్తులు వంటి రంగాలకు రాయితీలు ఇవ్వాలని చూస్తోంది. మొత్తానికి చర్చలు సఫలీకృతం అవుతాయని ఇరుపక్షాలు భావిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Maharashtra: ‘‘హిందీ వివాదం’’.. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ కలిసే అవకాశం..
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!