Fever Medicines: ఇండియా నుంచి చైనాకు జ్వరం మందుల ఎగుమతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India ready to export fever drugs to China amid COVID surge: ప్రపంచంలో అతిపెద్ద డ్రగ్ మేకర్ అయిన ఇండియా, చైనాకు జ్వరం మందులు పంపేందుకు సిద్దం అవుతోంది. కోవిడ్-19 వల్ల చైనా తీవ్రంగా దెబ్బతింటోంది. అక్కడ రోజుకు కొన్ని లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో చైనాకు ఫీవర్ మెడిసిన్స్ ఎగుమతులను పెంచేందుకు సిద్ధంగా ఉందని భారత ఔషధ ఎగుమతి సంఘం చైర్పర్సన్ గురువారం తెలిపారు.
ఈ నెల మొదటి వారంలో చైనా తన ‘జీరో కోవిడ్’ విధానాన్ని ఎత్తేసింది. దీంతో చైనా వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 20 రోజుల్లోనే ఏకంగా 25 కోట్ల మంది ప్రజలు కోవిడ్ బారిన పడినట్లు అంచానా. ఈ వారంలో ఒకే రోజు 3.7 కోట్ల కోవిడ్ కేసులు నమోదు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బీజింగ్, షాంఘై నగరాల్లో జనజీవితం అస్తవ్యస్తం అయింది. పలు నగరాలు, పట్టణాల్లోని ఆస్పత్రులు కోవిడ్ రోగులతో నిండిపోయాయి.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
Read Also: Charles Sobhraj: సీరియల్ కిల్లర్ ప్లేస్ లో సినిమా యాక్టర్ ఫోటో వేశారు…
ఇదిలా ఉంటే చైనా వ్యాప్తంగా ఐబూప్రోపెన్, పారాసెటమాల్ మాత్రలకు చైనాలో భారీ డిమాండ్ ఏర్పడింది. అకాస్మత్తుగా పెరిగిన కోవిడ్ కేసులతో ఈ రెండింటికి డిమాండ్ ఏర్పడింది. వీటి కొనుగోలుపై చైనాలో పరిమితులు విధించారు. చైనా కోరితే సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ తెలిపింది. అయితే దీనిపై భారత్ లోని చైనా రాయబార కార్యాలయం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రస్తుతం ఇండియా ఫార్మా ఎగుమతుల్లో కేవలం 1.4 శాతం మాత్రమే చైనాకు ఎగుమతి అవుతున్నాయి. 2021-22 ఫార్మెక్సిల్ వార్షిక నివేదిక ప్రకారం ఇండియా డ్రగ్స్ ఎగుమతుల్లో అమెరికా అతిపెద్ద వాటాదారుగా ఉంది. కోవిడ్-19 తర్వాత భారత ఫార్మా కంపెనీల షేర్ల గత కొన్ని రోజులగా పెరుగాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?