Cabinet Meeting: భారత్-పాక్ ఉద్రిక్తత.. రేపు ప్రధాని మోడీ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ..
- భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత..
- రేపు ప్రధాని మోడీ నేతృత్వంలో కీలక భేటీ..
Cabinet Meeting: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ కీలక సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షత ఈ సమావేశం జరుగబోతోంది. పాకిస్తాన్పై సైనిక చర్య తీసుకుంటారనే ఊహాగానాల నడుమ ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే, త్రివిధ దళాల అధిపతులు, ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్తో ప్రధాని మోడీ కీలక సమావేశాలు నిర్వహించారు. మరోవైపు భారత్ వరస ఆంక్షలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
Also Read
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
క్యాబినెట్ సమావేశంలో భారత్, పాక్ ఉద్రిక్తత కీలకం కాబోతోంది. రేపటి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే, బుధవారం(రేపు) దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్కి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 259 ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. యుద్ధం వస్తే ప్రజలు తమని తాము ఎలా కాపాడుకోవాలనే దానిపై ఈ డ్రిల్స్ జరుగుతున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వరసగా సమావేశాలతో కేంద్రం బిజీగా ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో ప్రధాని కీలక చర్చలు నిర్వహించారు. త్రివిధ దళాలతో ఇటీవల జరిగిన సమావేశంలో సైన్యానికి ప్రధాని పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఈ నేపథ్యంలో రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో పాకిస్తాన్ టార్గెట్గా కీలక నిర్ణయాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!