PM Modi: “కాంగ్రెస్ ఓ పాత ఫోన్”.. 2014లో వదిలేశారని ప్రధాని సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’లో కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రధాని నరేంద్రమోడీ. శుక్రవారం మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్ ని ప్రారంభించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ‘పాత ఫోన్’గా అభివర్ణించారు. 2014లోనే ప్రజలు ఆ ఫోన్లను వదిలేసి దేశ గతని మార్చే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆయన అన్నారు. ‘‘కాలం చెల్లిన ఫోన్లలో పనిచేయని స్క్రీన్లపై ఎన్ని సార్లు స్వైప్ చేసి, ఎన్ని బటన్లు నొక్కిన ఫలితం ఉండదు. రిస్టార్ట్ చేసినా, బ్యాటరీ మార్చినా ప్రయోజం ఉందు. గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి స్థితిలోనే ఉండేది’’ అని ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
Read Also: BRS Chief: 24 గంటల కరెంట్, రైతుబంధు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలి
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- CM Vijay: సీఎం విజయ్కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
2014లోనే ప్రజలు కాలం చెల్లిన ఫఓన్లను వదిలేశారని, ఈ దేశానికి సేవ చేసేందుకు మాకు అవకాశం ఇచ్చారని, 2014 కేవలం ఒక తేదీ మాత్రమే కాదని, అదో పెను మార్పు అంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. గతంలో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో ఏం జరిగిందో అని యూపీఏ హాయంలోని 2జీ కుంభకోణాన్ని ప్రస్తావించారు. మా హమాంలో 4జీని విస్తరించాం, కాని ఒక్క మచ్చకూడా పడలేదని కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. 6జీ టెక్నాలజీలో భారత్ ప్రపంచానికి మార్గనిర్దేశంగా నిలుస్తుందని మోడీ అన్నారు.
వేగవంతమైన 5జీ టెలిఫోన్ నెట్వర్క్ తీసుకొచ్చిన తర్వాత, ఇప్పుడు 6జీ వైపు అడుగులు వేస్తున్నామని దేశం సాధించిన విజయాలను ప్రధాని గుర్తు చేశారు. 5జీ అందుబాటులోకి వచ్చిన ఏడాది లోపే దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోగలిగామని, బ్రాడ్ బ్యాండ్ వేగంలో గతంలో భారత్ 118వ ర్యాంకులో ఉంటే, ఇప్పుడు 43వ ర్యాంకుకు చేరుకున్నామని ఆయన వెల్లడించారు. భారత్ లో గూగుల్ తన ఫిక్సెల్ ఫోన్లను తయారు చేయనున్నట్లు ప్రకటించిందని, శాంసంగ్ ఫోల్డ్ 5, యాపిల్ ఫోన్ 15 ఇప్పటికే దేశంలో తయారవుతున్నాయని తెలిపారు. ఇప్పుడు ప్రపంచమంతా మేడిన్ ఇండియా ఫోన్లు ఉపయోగిస్తున్నాయని అన్నారు.
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!