PM Modi: “కాంగ్రెస్ ఓ పాత ఫోన్”.. 2014లో వదిలేశారని ప్రధాని సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’లో కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రధాని నరేంద్రమోడీ. శుక్రవారం మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్ ని ప్రారంభించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ‘పాత ఫోన్’గా అభివర్ణించారు. 2014లోనే ప్రజలు ఆ ఫోన్లను వదిలేసి దేశ గతని మార్చే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆయన అన్నారు. ‘‘కాలం చెల్లిన ఫోన్లలో పనిచేయని స్క్రీన్లపై ఎన్ని సార్లు స్వైప్ చేసి, ఎన్ని బటన్లు నొక్కిన ఫలితం ఉండదు. రిస్టార్ట్ చేసినా, బ్యాటరీ మార్చినా ప్రయోజం ఉందు. గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి స్థితిలోనే ఉండేది’’ అని ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
Read Also: BRS Chief: 24 గంటల కరెంట్, రైతుబంధు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలి
Also Read
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
2014లోనే ప్రజలు కాలం చెల్లిన ఫఓన్లను వదిలేశారని, ఈ దేశానికి సేవ చేసేందుకు మాకు అవకాశం ఇచ్చారని, 2014 కేవలం ఒక తేదీ మాత్రమే కాదని, అదో పెను మార్పు అంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. గతంలో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో ఏం జరిగిందో అని యూపీఏ హాయంలోని 2జీ కుంభకోణాన్ని ప్రస్తావించారు. మా హమాంలో 4జీని విస్తరించాం, కాని ఒక్క మచ్చకూడా పడలేదని కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. 6జీ టెక్నాలజీలో భారత్ ప్రపంచానికి మార్గనిర్దేశంగా నిలుస్తుందని మోడీ అన్నారు.
వేగవంతమైన 5జీ టెలిఫోన్ నెట్వర్క్ తీసుకొచ్చిన తర్వాత, ఇప్పుడు 6జీ వైపు అడుగులు వేస్తున్నామని దేశం సాధించిన విజయాలను ప్రధాని గుర్తు చేశారు. 5జీ అందుబాటులోకి వచ్చిన ఏడాది లోపే దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోగలిగామని, బ్రాడ్ బ్యాండ్ వేగంలో గతంలో భారత్ 118వ ర్యాంకులో ఉంటే, ఇప్పుడు 43వ ర్యాంకుకు చేరుకున్నామని ఆయన వెల్లడించారు. భారత్ లో గూగుల్ తన ఫిక్సెల్ ఫోన్లను తయారు చేయనున్నట్లు ప్రకటించిందని, శాంసంగ్ ఫోల్డ్ 5, యాపిల్ ఫోన్ 15 ఇప్పటికే దేశంలో తయారవుతున్నాయని తెలిపారు. ఇప్పుడు ప్రపంచమంతా మేడిన్ ఇండియా ఫోన్లు ఉపయోగిస్తున్నాయని అన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!