Cancer Cases: భారతదేశంలో 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cancer Cases: దేశంలో రానున్న కాలంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతుందని ఢిల్లీ ఎయిమ్స్ అంచనా వేస్తోంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అందించిన డేటా ఆధారంగా ఎయిమ్స్ ఈ అంచనాను రూపొందించింది. 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని ఢిల్లీలోని ఎయిమ్స్లోని సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్విఎస్ డియో అన్నారు. ప్రతీ ఏడాది 13-14 లక్షల మంది ప్రాణాంతక వ్యాధి బారిన పడే అవకాశం ఉందని.. 2026 నాటికి ఈ సంఖ్య 20 లక్షలకు చేరుకోవచ్చని ఆయన అన్నారు.
ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం థీమ్ ‘ క్లోజింగ్ ద గ్యాప్’ అని ఆయన వెల్లడించారు. క్యాన్సర్ కు సంబంధించి అపోహలపై అవగాహన లేకపోవడం, వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని థీమ్ను ఎంచుకున్నట్లు ఆయన వివరించారు. క్యాన్సర్ పూర్తిగా నయం కాదనే ప్రజల అపోహా సరికాదని పేర్కొన్నారు. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుందని ఆయన వెల్లడించారు.
Also Read
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
- Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
Read Also: Anand Mahindra: ఇండియాకు వ్యతిరేకంగా పందెం కాయొద్దు.. గ్లోబల్ మీడియాకు వార్నింగ్..
ఆరోగ్యమైన జీవన శైలి, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడంతో క్యాన్సర్ ను పారద్రోలవచ్చని అన్నారు. ప్రాసెస్డ్, ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ క్యాన్సర్ రిస్క్ ను పెంచుతాయని వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. మొత్తం క్యాన్సర్ కేసుల్లో 30 శాతం స్మోకింగ్, ఆల్కాహాల్ డ్రికింగ్ అలవాట్లు ఉన్నవారికే వస్తున్నాయని అన్నారు. దేశంలోని ఈశాన్య ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళల్లో పిత్తాశయ కేసులు పెరుగుతున్నాయి. అనారోగ్య జీవనశైలి మరియు అపరిశుభ్రమైన నీరు మరియు ఆహారం తీసుకోవడం వల్ల కడుపు, పిత్తాశయం, మెడ, తలకు సంబంధించిన క్యాన్సర్లు ఈశాన్య ప్రాంతా ప్రజల్లో ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్లు వెల్లడించారు.
దేశంలో 16 ఏళ్లలోపు పిల్లల్లో జన్యుపరమైన క్యాన్సర్ కేసులు పెరిగాయని.. వాయుకాలుష్యం, నీటి కాలుష్యం, అనారోగ్యకరమైన జీవన శైలి కారంగా క్యాన్సర్లు వస్తున్నట్లు నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ సుష్మా భట్నాగర్ తెలిపారు. వాయుకాలుష్యం గర్భాశయ క్యాన్సర్లకు దారి తీస్తోందని అన్నారు. ఇంతకుముందు 50 ఏళ్లు పైబడిన వారికి క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉండేవని.. ప్రస్తుతం యువతరంలో కూడా ఈ ప్రాణాంతక వ్యాధి సోకుతోందని అన్నారు. క్యాన్సర్ చికిత్స మరింత అభివృద్ధి చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు.
తాజావార్తలు
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Test Match: ఆ ప్లేయర్కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
-
Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
-
Kitchen Tips: బియ్యంలో పురుగుల నుంచి బిర్యానీ రైస్ వరకు.. వంటగది రూపురేఖలు మార్చే అమేజింగ్ చిట్కాలు!
-
Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!