Cancer Cases: భారతదేశంలో 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cancer Cases: దేశంలో రానున్న కాలంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతుందని ఢిల్లీ ఎయిమ్స్ అంచనా వేస్తోంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అందించిన డేటా ఆధారంగా ఎయిమ్స్ ఈ అంచనాను రూపొందించింది. 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని ఢిల్లీలోని ఎయిమ్స్లోని సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్విఎస్ డియో అన్నారు. ప్రతీ ఏడాది 13-14 లక్షల మంది ప్రాణాంతక వ్యాధి బారిన పడే అవకాశం ఉందని.. 2026 నాటికి ఈ సంఖ్య 20 లక్షలకు చేరుకోవచ్చని ఆయన అన్నారు.
ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం థీమ్ ‘ క్లోజింగ్ ద గ్యాప్’ అని ఆయన వెల్లడించారు. క్యాన్సర్ కు సంబంధించి అపోహలపై అవగాహన లేకపోవడం, వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని థీమ్ను ఎంచుకున్నట్లు ఆయన వివరించారు. క్యాన్సర్ పూర్తిగా నయం కాదనే ప్రజల అపోహా సరికాదని పేర్కొన్నారు. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుందని ఆయన వెల్లడించారు.
Also Read
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
Read Also: Anand Mahindra: ఇండియాకు వ్యతిరేకంగా పందెం కాయొద్దు.. గ్లోబల్ మీడియాకు వార్నింగ్..
ఆరోగ్యమైన జీవన శైలి, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడంతో క్యాన్సర్ ను పారద్రోలవచ్చని అన్నారు. ప్రాసెస్డ్, ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ క్యాన్సర్ రిస్క్ ను పెంచుతాయని వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. మొత్తం క్యాన్సర్ కేసుల్లో 30 శాతం స్మోకింగ్, ఆల్కాహాల్ డ్రికింగ్ అలవాట్లు ఉన్నవారికే వస్తున్నాయని అన్నారు. దేశంలోని ఈశాన్య ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళల్లో పిత్తాశయ కేసులు పెరుగుతున్నాయి. అనారోగ్య జీవనశైలి మరియు అపరిశుభ్రమైన నీరు మరియు ఆహారం తీసుకోవడం వల్ల కడుపు, పిత్తాశయం, మెడ, తలకు సంబంధించిన క్యాన్సర్లు ఈశాన్య ప్రాంతా ప్రజల్లో ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్లు వెల్లడించారు.
దేశంలో 16 ఏళ్లలోపు పిల్లల్లో జన్యుపరమైన క్యాన్సర్ కేసులు పెరిగాయని.. వాయుకాలుష్యం, నీటి కాలుష్యం, అనారోగ్యకరమైన జీవన శైలి కారంగా క్యాన్సర్లు వస్తున్నట్లు నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ సుష్మా భట్నాగర్ తెలిపారు. వాయుకాలుష్యం గర్భాశయ క్యాన్సర్లకు దారి తీస్తోందని అన్నారు. ఇంతకుముందు 50 ఏళ్లు పైబడిన వారికి క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉండేవని.. ప్రస్తుతం యువతరంలో కూడా ఈ ప్రాణాంతక వ్యాధి సోకుతోందని అన్నారు. క్యాన్సర్ చికిత్స మరింత అభివృద్ధి చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు.
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!