India On Pak: అమాయకులపైన ఏంట్రా మీ ప్రతాపం..ఆఫ్ఘన్పై పాక్ దాడిని ఖండించిన భారత్..
- ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులను ఖండించిన భారత్..
- అమాయకులపై దాడులు చేయడంపై పాక్పై ఆగ్రహం..
- సొంత తప్పులకు పొరుగువారిని నిందించే అలవాటు మానుకోవాలని హితవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On Pak: ఇటీవల తాలిబన్లు టార్గెట్గా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు చేసింది. రెండు దేశాల సరిహద్దుల్లోని ఆప్ఘన్ పక్తికా ప్రావిన్సుపై ఈ దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడులో పిల్లలు ,మహిళలు అమాయకులు 40 మందికి పైగా మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు చెప్పారు. ఈ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. దీనికి తగ్గట్లుగానే తాలిబన్లు రెండు దేశాలకు మధ్య ఉన్న సరిహద్దు రేఖ డ్యూరాండ్ లైన్ని దాటి పాకిస్తాన్పై దాడులు చేశారు.
ఇదిలా ఉంటే, ఈ దాడులపై భారత్ స్పందించింది. ‘‘అమాయక పౌరులపై ఏదైనా దాడిని నిస్సందేహంగా ఖండిస్తున్నాం’’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ తన సొంత అంతర్గత వైఫల్యాలకు పొరుగువారిని నిందించే పాత పద్ధతని అవలంభిస్తోందని భారత్ చెప్పింది.
Also Read
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
Read Also: Allu Arjun: పరామర్శకు అల్లు అర్జున్ వెళ్లొచ్చు.. కానీ?
ఆఫ్ఘన్ పౌరులపై పాకిస్తాన్ వైమానిక దాడులకు సంబంధించి మీడియా ప్రశ్నలకు ప్రతిస్పందనగా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘మహిళలు మరియు పిల్లలతో సహా ఆఫ్ఘన్ పౌరులపై వైమానిక దాడులపై మీడియా నివేదికలను గమనించాము, ఇందులో అనేక విలువైన ప్రాణాలు కోల్పోయారు. అమాయక పౌరులపై దాడులను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాము’’ అని అన్నారు.
పాకిస్తాన్ తాలిబన్లకు, ఆఫ్ఘన్ పాలకులు సాయం చేస్తున్నారని పదే పదే పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే, పాక్ ఆరోపణల్ని ఆఫ్ఘన్ తాలిబన్లు ఖండిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో పాక్ సైనికులు, పోలీసులపై పాక్ తాలిబన్లు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 26 డిసెంబర్ 2024న, పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. 46 మంది మరణించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. పాక్ చర్య అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించిందని ఆఫ్ఘనిస్తాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనయతుల్లా ఖౌరజ్మీ అన్నారు.
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..