K Annamalai: డీఎంకే, ఇండియా కూటమి ‘‘హిందూ వ్యతిరేకులు’’.. సుబ్రమణ్య స్వామి ఆలయం వివాదంపై అన్నామలై..
- తమిళనాడులో సుబ్రమణ్యస్వామి ఆలయ దీపం వివాదం..
- తీర్పు చెప్పి జడ్జిపై ‘‘అభిశంసన’’కు సిద్ధమైన డీఎంకే, కాంగ్రెస్..
- ‘‘హిందూ వ్యతిరేకత’’ అంటూ అన్నామలై విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Annamalai: తిరుప్పరకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయంలో దీపం వెలిగింపు వివాదంగా మారింది. ఇటీవల మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తి జిఆర్ స్వామినాథన్, కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించాలని తీర్పు చెప్పారు. అయితే, ఈ తీర్పును ప్రభుత్వం పాటించలేదు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న కొండ కింద ఉన్న స్తంభంపై దీపం వెలిగించారు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ, భక్తుల్ని కొండపై దీపం వెలిగించేందుకు డీఎంకే ప్రభుత్వం అనుమతించకపోవడం ఉద్రిక్తతలకు కారణమైంది. అయితే, ఈ కొండపై 6వ శతాబ్ధం నాటి కార్తికేయుడి ఆలయంతో పాటు 14వ శతాబ్ధం నాటి దర్గా ఉంది. దీంతో మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతాయని డీఎంకే వాదిస్తోంది.
Read Also: Rahul Gandhi: గాంధీ హత్య తర్వాత, “ఆర్ఎస్ఎస్” అన్ని సంస్థల్ని ఆక్రమించుకుంటోంది..
Also Read
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
ఇదిలా ఉంటే, తీర్పు చెప్పిన న్యాయమూర్తి జిఆర్ స్వామినాథన్ను తొలగించాలని మంగళవారం డీఎంకే, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఇతర ఇండియా కూటమికి చెందిన 120 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఓంబిర్లాకు ‘‘అభిశంసన’’ తీర్మానాన్ని అందించారు. ఈ చర్యపై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పార్టీలు వారి ‘‘హిందూ వ్యతిరేకతను’’ ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు. భారత సుప్రీంకోర్టు ముందు అప్పీల్ పెండింగ్లో ఉన్నప్పటికీ అభిశంసన తీర్మాణం ముస్లింల బుజ్జగింపు రాజకీయాల కోసమే అని ఆయన అన్నారు. ఈ చర్య రాజకీయ ఒత్తిడి ద్వారా తీర్పును సవాల్ చేయవచ్చనే సందేశాన్ని పంపిస్తోందని, ఇది రాజ్యాంగ విలువలకు ముప్పు కలిగిస్తుందని అన్నామలై ఆరోపించారు.
ఇది న్యాయమూర్తిని బెదిరించడమే అని బీజేపీ అధికార ప్రతినిధి నారాయణ్ తిరుపతి ఆరోపించారు. న్యాయమూర్తి బ్రహ్మణ వర్గానికి చెందిన వాడు కాబట్టి ఆయనను బెదిరించాలని వారు కోరుకుంటున్నారని, డీఎంకే అందుకే ఇలా చేస్తో్ందని, డీఎంకే బ్రహ్మణ వ్యతిరేక, హిందూ వ్యతిరేకతకు ప్రసిద్ధి చెందిందని, అందుకే వారు ఇలా చేస్తున్నారని అన్నారు. ఇదిలా ఉంటే, మద్రాస్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో, అరుళ్మిఘు సుబ్రమణ్య స్వామి ఆలయంలోని భక్తులు ‘దీపథూన్’ వద్ద సాంప్రదాయ ‘కార్తీగై దీపం’ వెలిగించడానికి అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.
తాజావార్తలు
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!