Rahul Gandhi: గాంధీ హత్య తర్వాత, “ఆర్ఎస్ఎస్” అన్ని సంస్థల్ని ఆక్రమించుకుంటోంది..
- పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ ఫైర్..
- ఆర్ఎస్ఎస్, ఎన్నికల సంఘంపై ఆరోపణలు..
Rahul Gandhi: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వందేమాతరంపై చర్చ ప్రారంభించిన ఒక రోజు తర్వాత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ భారత సమాజంలో సమానత్వం యొక్క ప్రాథమిక సూత్రాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ‘‘వారు సమానత్వాన్ని నమ్మరు, సోపానక్రమాన్ని నమ్ముతారు. వారు ఉన్నతంగా ఉండాలని నమ్ముతారు’’ అని అన్నారు. మహాత్మా గాంధీ హత్య తర్వాత భారతదేశంలోని అన్ని సంస్థల్ని ఆర్ఎస్ఎస్ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు.
Read Also: Jai Anmol Ambani: అంబానీ ఫ్యామిలీకి CBI ఝలక్.. జై అన్మోల్పై రూ. 228 కోట్లు బ్యాంకు మోసం ఆరోపణ
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
సంస్థలపై నియంత్రణ సాధించేందుకు ప్రజాస్వామ్య ప్రక్రియను నేరుగా దెబ్బతీస్తున్నారని, ఎన్నికల సమగ్రతను బలహీనపరుస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సంఘం తీసుకువచ్చిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’పై ఆరోపణలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ఎన్నికల సంఘాన్ని ఉపయోగిస్తోదని ఆయన అన్నారు. ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని మూడు ప్రశ్నలు సంధించారు. ఈసీ స్వయంప్రతిపత్తిని బీజేపీ బలహీనపరుస్తోందని, దాని స్వతంత్రతను పునరుద్ధరిస్తారా?, అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మధ్య సర్ ప్రక్రియలో ఓటర్ల జాబితాలను తారుమారు చేయకుండా నిరోధించడానికి ఏ రక్షణలు ఉన్నాయి.?, ఈసీ నియమకాలు, నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎందుకు కనిపిస్తున్నాయి? అని ప్రశ్నించారు. ప్రధాన న్యాయమూర్తిని ఎన్నికల సెలక్షన్ ప్యానెల్ నుంచి ఎందుకు తొలగించారు? ఆయనపై నమ్మకం లేదా అని బీజేపీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ అడిగారు. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షాలే ఎన్నికల కమిషనర్ను ఎన్నుకుంటారా? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!