Rahul Gandhi: గాంధీ హత్య తర్వాత, “ఆర్ఎస్ఎస్” అన్ని సంస్థల్ని ఆక్రమించుకుంటోంది..
- పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ ఫైర్..
- ఆర్ఎస్ఎస్, ఎన్నికల సంఘంపై ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వందేమాతరంపై చర్చ ప్రారంభించిన ఒక రోజు తర్వాత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ భారత సమాజంలో సమానత్వం యొక్క ప్రాథమిక సూత్రాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ‘‘వారు సమానత్వాన్ని నమ్మరు, సోపానక్రమాన్ని నమ్ముతారు. వారు ఉన్నతంగా ఉండాలని నమ్ముతారు’’ అని అన్నారు. మహాత్మా గాంధీ హత్య తర్వాత భారతదేశంలోని అన్ని సంస్థల్ని ఆర్ఎస్ఎస్ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు.
Read Also: Jai Anmol Ambani: అంబానీ ఫ్యామిలీకి CBI ఝలక్.. జై అన్మోల్పై రూ. 228 కోట్లు బ్యాంకు మోసం ఆరోపణ
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
సంస్థలపై నియంత్రణ సాధించేందుకు ప్రజాస్వామ్య ప్రక్రియను నేరుగా దెబ్బతీస్తున్నారని, ఎన్నికల సమగ్రతను బలహీనపరుస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సంఘం తీసుకువచ్చిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’పై ఆరోపణలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ఎన్నికల సంఘాన్ని ఉపయోగిస్తోదని ఆయన అన్నారు. ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని మూడు ప్రశ్నలు సంధించారు. ఈసీ స్వయంప్రతిపత్తిని బీజేపీ బలహీనపరుస్తోందని, దాని స్వతంత్రతను పునరుద్ధరిస్తారా?, అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మధ్య సర్ ప్రక్రియలో ఓటర్ల జాబితాలను తారుమారు చేయకుండా నిరోధించడానికి ఏ రక్షణలు ఉన్నాయి.?, ఈసీ నియమకాలు, నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎందుకు కనిపిస్తున్నాయి? అని ప్రశ్నించారు. ప్రధాన న్యాయమూర్తిని ఎన్నికల సెలక్షన్ ప్యానెల్ నుంచి ఎందుకు తొలగించారు? ఆయనపై నమ్మకం లేదా అని బీజేపీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ అడిగారు. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షాలే ఎన్నికల కమిషనర్ను ఎన్నుకుంటారా? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!