PM Modi: ఖజానా ఖాళీ అయితే ప్రజలపైనే భారం: ప్రధాని మోడీ
PM Modi: ఖజానా ఖాళీ అయితే ప్రజలపైనే భారం పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మోడీ మంగళవారం పూనే పర్యటనలో ఉన్నారు. పూనే పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. కర్ణాటక, రాజస్థాన్ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ఏ పార్టీ అయినా.. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తే దాని భారం ప్రజలే భరించాల్సి ఉంటుందన్నారు. విదేశీ వలసవాదులు పెట్టిన పేర్లను మారుస్తుంటే కొందరు ఇబ్బందిగా భావిస్తున్నారని విమర్శించారు. పరస్పర విశ్వాసం లేనిచోట అభివృద్ధి అసాధ్యమని వ్యాఖ్యానించారు. పూనే పర్యటనలో భాగంగా ‘లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు’ స్వీకరించడంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. కర్ణాటక, రాజస్థాన్లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు.
Read also: Kavin: పెళ్లి పీటలు ఎక్కనున్న ‘దాదా’ హీరో.. వధువు ఎవరంటే.. ?
Also Read
- Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
- Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
- Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో 'మాన్' ప్రభుత్వం కూలిపోతుందా!
- Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
‘ఒకవైపు పూనే వేగంగా అభివృద్ధి చెందుతోంది. మరోవైపు.. బెంగళూరులో ప్రస్తుతం ఏం జరుగుతోందో చూస్తున్నాం. బెంగళూరుతోపాటు రాష్ట్ర అభివృద్ధికి నిధులు లేవని కర్ణాటక ప్రభుత్వం స్వయంగా అంగీకరించిందని.. పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చి ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్లోనూ అదే పరిస్థితి. అక్కడ అప్పులు పెరుగుతున్నాయి. అభివృద్ధి నిలిచిపోయింది. ఏ పార్టీ అయినా.. తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తే దాని భారం ప్రజలపైనే పడుతుందని రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనను ఉద్దేశించి ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ‘లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు’ స్వీకరించిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మీడియా స్వేచ్ఛ ప్రాధాన్యాన్ని తిలక్ అర్థం చేసుకున్నారు. స్వాతంత్ర్య పోరాట పంథానూ మార్చారు’ అని పేర్కొన్నారు. ఇదే వేదికపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ.. దేశంలో తొలి సర్జికల్ స్ట్రైక్ ఛత్రపతి శివాజీ సమయంలో జరిగిందని చెప్పారు. శివాజీ మహారాజ్ ఎప్పుడూ ఎవరి భూమినీ లాక్కోలేదన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో రెండు శకాలు ఉన్నాయని.. ఒకటి తిలక్, రెండోది మహాత్మా గాంధీ శకమని తెలిపారు. ఎన్సీపీలో చీలిక అనంతరం పవార్, ప్రధాని మోదీలు సమావేశం కావడం ఇదే మొదటిసారి.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!