PM Modi: ఖజానా ఖాళీ అయితే ప్రజలపైనే భారం: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఖజానా ఖాళీ అయితే ప్రజలపైనే భారం పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మోడీ మంగళవారం పూనే పర్యటనలో ఉన్నారు. పూనే పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. కర్ణాటక, రాజస్థాన్ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ఏ పార్టీ అయినా.. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తే దాని భారం ప్రజలే భరించాల్సి ఉంటుందన్నారు. విదేశీ వలసవాదులు పెట్టిన పేర్లను మారుస్తుంటే కొందరు ఇబ్బందిగా భావిస్తున్నారని విమర్శించారు. పరస్పర విశ్వాసం లేనిచోట అభివృద్ధి అసాధ్యమని వ్యాఖ్యానించారు. పూనే పర్యటనలో భాగంగా ‘లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు’ స్వీకరించడంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. కర్ణాటక, రాజస్థాన్లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు.
Read also: Kavin: పెళ్లి పీటలు ఎక్కనున్న ‘దాదా’ హీరో.. వధువు ఎవరంటే.. ?
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
‘ఒకవైపు పూనే వేగంగా అభివృద్ధి చెందుతోంది. మరోవైపు.. బెంగళూరులో ప్రస్తుతం ఏం జరుగుతోందో చూస్తున్నాం. బెంగళూరుతోపాటు రాష్ట్ర అభివృద్ధికి నిధులు లేవని కర్ణాటక ప్రభుత్వం స్వయంగా అంగీకరించిందని.. పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చి ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్లోనూ అదే పరిస్థితి. అక్కడ అప్పులు పెరుగుతున్నాయి. అభివృద్ధి నిలిచిపోయింది. ఏ పార్టీ అయినా.. తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తే దాని భారం ప్రజలపైనే పడుతుందని రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనను ఉద్దేశించి ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ‘లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు’ స్వీకరించిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మీడియా స్వేచ్ఛ ప్రాధాన్యాన్ని తిలక్ అర్థం చేసుకున్నారు. స్వాతంత్ర్య పోరాట పంథానూ మార్చారు’ అని పేర్కొన్నారు. ఇదే వేదికపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ.. దేశంలో తొలి సర్జికల్ స్ట్రైక్ ఛత్రపతి శివాజీ సమయంలో జరిగిందని చెప్పారు. శివాజీ మహారాజ్ ఎప్పుడూ ఎవరి భూమినీ లాక్కోలేదన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో రెండు శకాలు ఉన్నాయని.. ఒకటి తిలక్, రెండోది మహాత్మా గాంధీ శకమని తెలిపారు. ఎన్సీపీలో చీలిక అనంతరం పవార్, ప్రధాని మోదీలు సమావేశం కావడం ఇదే మొదటిసారి.
తాజావార్తలు
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!