Rajastan: పేపర్ లీకేజీకి పాల్పడితే ఇక యావజ్జీవమే… బిల్లు చేయనున్న రాజస్థాన్ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajastan: ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఒక రాష్ట్రంలో జరిగి.. మరొక రాష్ట్రంలో జరగడం లేదనేది లేదు. ఈ ఏడాదిలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) నిర్వహించిన పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు ముందుగానే లీకయ్యాయి. ప్రశ్నా పత్రాల లీకేజీతో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని పేర్కొంటూ ఏకంగా ఈడీని విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అలానే రాజస్థాన్లోనూ పోటీ పరీక్షల లీకేజీ జరిగింది. గతంలో గుజరాత్లోనూ జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రాష్ట్రాల్లో ఈ లీకేజ్ వ్యవహారాలు కొనసాగుతున్నాయి. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని జనరల్గా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు డిమాండ్ చేస్తుండగా.. పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీకి పాల్పడితే ఇకపై జీవిత ఖైదు విధించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానున్నట్టు ఆ రాష్ట్ర సీఎం ట్విట్ చేశారు.
Read also: Venkatesh : స్వామి వివేకానంద వెబ్ సిరీస్ లో నటించాలనుకున్న వెంకటేష్.. కానీ కుదరలేదుగా..
Also Read
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
పేపర్ లీకేజీకి చెక్ పెడుతూ.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోటీ పరీక్షల్లో పేపర్లు లీక్ చేసిన వారికి ఇకపై యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. ఈ ఆర్డినెన్స్ ద్వారా కాపీయింగ్ మాఫియాకు గరిష్ట శిక్షగా జీవిత ఖైదు విధించే నిబంధనను జోడించనున్నారు. ఈ సందర్బంగా సీఎం అశోక్ గహ్లోత్ ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్రంలో జరిగే పోటీ పరీక్షల్లో పారదర్శకతను పెంచేందుకు ఉత్తమ విధానం రూపొందించాలని రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు, ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పేపర్ లీక్లపై నమోదయ్యే కేసుల్లో శిక్షను పెంచేందుకు బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురావాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని.. ప్రస్తుతం ఉన్న పదేళ్ల శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని నిర్ణయించామని ట్విట్టర్లో పేర్కొన్నారు.
Read also: Niharika-Chaitanya Divorce: నిహారిక-చైతన్య విడాకులు.. ముందుగా పిటిషన్ వేసింది ఎవరో తెలుసా?
లీకేజీ మాఫియాపై రాజస్థాన్ ప్రభుత్వం గతేడాది కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ యాంటీ కాపీయింగ్ చట్టం ప్రకారం 10 ఏళ్ల జైలుశిక్ష, రూ. 10 కోట్ల వరకు జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించారు. కొత్త యాంటీ కాపీయింగ్ చట్టం అమల్లోకి వచ్చినా తరువాత కూడా రాజస్థాన్లో నాలుగు పోటీ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. పదే పదే పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కాపీయింగ్ మాఫియాను అరికట్టేందుకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ నిర్ణయం గురించి సమాచారాన్ని పంచుకున్న తర్వాత రాజస్థాన్ నిరుద్యోగ ఇంటిగ్రేటెడ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేన్ యాదవ్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు ధన్యవాదాలు తెలిపారు. పేపర్ లీక్ మాఫియాలకు చట్ట భయం ఉండేలా కఠినంగా శిక్షించాలని తాను చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నానని ఉపేన్ యాదవ్ అన్నారు. కఠిన శిక్షలు విధించడం వల్ల పేపర్ లీక్ మాఫియాలో భయానక వాతావరణం నెలకొంటుందని, దీంతో పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిరుద్యోగుల పోరాట విజయమని ఉపేన్ యాదవ్ తెలిపారు.
తాజావార్తలు
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!