Excise Department decision: మందేసి పట్టుబడితే అక్కడ రాచ మర్యాదలే.. ఆలస్యం ఎందుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Excise Department decision: మద్య నిషేధం అమలవుతున్న బిహార్ VIP మందుబాబుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలను నిర్మిస్తోంది. మద్యం తాగి పట్టుబడే ప్రజాప్రతినిధులు, ఉన్నత ఉద్యోగులు, ప్రముఖులను 24 గంటలపాటు అందులో ఉంచనుంది.అత్యాధునిక సౌకర్యాలన్నీ ఆ కేంద్రాల్లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
మద్య నిషేధం అమలవుతున్న బీహార్లో మద్యం సేవించి పట్టుబడిన వారికి రాజ మర్యాదలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. మద్యం సేవించి పట్టుబడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, సమాజంలోని ప్రముఖుల కోసం వీటిని నిర్మించినట్లు బీహార్ ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం సేవించి పట్టుబడిన వీఐపీల కోసం పడకలు, పరుపులు, సోఫాలు, కుర్చీలు, బల్లలు, ఏసీ సౌకర్యాలు కల్పించారు. ఈ కేంద్రంలో అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించారు. సమస్తిపూర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కె చౌదరి మాట్లాడుతూ శిక్షణ పొందిన కుక్కను కూడా ప్రతి కేంద్రంలో రక్షణ కోసం ఉంచుతున్నట్లు తెలిపారు. మద్యం తాగి పట్టుబడిన వీఐపీలను 24 గంటలు మాత్రమే ఈ కేంద్రాల్లో ఉండేందుకు అనుమతిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలను ఆధునిక సౌకర్యాలతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
- Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!

బీహార్లో ఏప్రిల్ 2016 నుంచి మద్య నిషేధం అమలులో ఉంది. మద్యం తాగి పట్టుబడిన వారి నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. 2 వేల నుంచి 5 వేల వరకు జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకు 20 వేల మందిని అరెస్టు చేశారు. చాలా మంది డ్రగ్స్ బానిసలు నెలల తరబడి జైలు జీవితం గడిపారు. నిషేధాన్ని ఉల్లంఘించినందుకు నేరస్థుడిని పోలీసులు పట్టుకున్నప్పుడు, నిందితుడు మద్యం ఎక్కడి నుండి పొందారో ఆ వ్యక్తి పేరును వెల్లడించాలనే నిబంధన కూడా ఉంది. ప్రస్తుతం బీహార్లో జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. జేడీయూ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవలే బీజేపీకి వీడ్కోలు పలికి ఆర్జేడీ-కాంగ్రెస్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
#WATCH | Bihar: The Excise Department has arranged a VIP ward for VIPs caught intoxicated publically in the state. VIP cells have been constructed in Samastipur Excise Department to keep VIP persons for 24 hours. pic.twitter.com/v85fEDAP62
— ANI (@ANI) October 9, 2022
తాజావార్తలు
-
New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
-
Team India: ఇండియా-A జట్టులోకి మరో ఆల్రౌండర్ .. హర్ష్ దూబే అవుట్..
-
Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
-
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!