Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- 33 ఫేక్ అకౌంట్లతో భారీ సైబర్ దందా బట్టబయలు
- ప్రైవేట్ బ్యాంక్ అధికారుల పాత్రపై సంచలన ఆరోపణలు
- డబ్బు ఆశతో స్టూడెంట్స్, కార్మికులే టార్గెట్
- ఖాతా అమ్ముకుంటే జైలు తప్పదన్న డీసీపీ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mule Account Scam : సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్స్ (Mule Accounts) సప్లై చేస్తూ అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్న ఒక ముఠా గుట్టును సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ గారు ప్రెస్మీట్లో వెల్లడించారు. సైబర్ ఫ్రాడ్స్ చేయడానికి నేరగాళ్లకు ఏకంగా 33 ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ సప్లై చేసిన దిలీప్ సింగ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అక్రమ దందాలో ప్రైవేట్ బ్యాంక్ అధికారుల హస్తం కూడా ఉండటం ఇప్పుడు కలకలం రేపుతోంది.
నిందితుడు దిలీప్ సింగ్ ఈజీ మనీ కోసం మ్యూల్ ఖాతాలను ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులైన ఎస్ బ్యాంక్ (Yes Bank), కోటాక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) లకి చెందిన కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. నిందితుడు దిలీప్ సింగ్ ఈ అకౌంట్లన్నింటినీ విదేశాల్లో లేదా మరెక్కడో దాక్కుని ఆపరేట్ చేస్తున్న జోర్డాన్, పింటు భాయ్ అనే ప్రధాన సైబర్ నేరగాళ్లకు సప్లై చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ జోర్డాన్, పింటు భాయ్ ఇద్దరూ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
ఈ ముఠా ముఖ్యంగా అమాయక స్టూడెంట్స్, చిన్న చిన్న వ్యాపారులు, రోజువారీ లేబర్ వర్క్ చేసుకునే వారిని టార్గెట్ చేస్తోంది. వారికి కొద్దిగా డబ్బు ఆశ చూపి, వారి ఆధార్, పాన్ కార్డు వివరాలతో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తున్నారు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల డిమాండ్ను బట్టి ఒక్కో అకౌంట్ను భారీ ధరలకు అమ్ముకుంటున్నారు. ఈ అకౌంట్ల ద్వారానే కోట్లాది రూపాయల సైబర్ మోసాల డబ్బు చేతులు మారుతోంది. ఈ లూప్ను బ్రేక్ చేయడానికి నిందితుడికి చెందిన 23 బ్యాంక్ అకౌంట్స్ను తక్షణమే ఫ్రీజ్ చేయాల్సిందిగా ఇప్పటికే బ్యాంక్ అధికారులను కోరినట్లు డీసీపీ సాయి మనోహర్ వెల్లడించారు.
ఆన్లైన్లో పరిచయమైన జోర్డాన్, పింటు భాయ్ లతో చేతులు కలిపి దిలీప్ సింగ్ ఈ ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. ఈ సందర్భంగా ప్రజలకు డీసీపీ సాయి మనోహర్ గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. “కొద్దిపాటి డబ్బు ఆశతో మీ బ్యాంక్ ఖాతాలను ఇతరులకు అమ్ముకుంటే, మీ జీవితాన్ని మీరే చేతులారా అమ్ముకున్నట్లే. ఇలాంటి ఇల్లీగల్ అకౌంట్ల ద్వారా సైబర్ నేరాలు జరిగితే, అసలు ఖాతాదారులు ఎంతటి అమాయకులైనా సరే పోలీస్ విచారణ , జైలు శిక్ష ఎదుర్కోక తప్పదు” అని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
-
ChatGPT వాడుతున్నారా? ఇకపై మీకు ఒక కొత్త తలనొప్పి రాబోతుంది!
-
The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
-
Trump Hair: హెయిర్స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!