New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
- మణుగూరు–రామగుండం కొత్త రైల్వే లైన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- మేడారం, భద్రాచలం భక్తులకు భారీ ఊరట
- గిరిజన ప్రాంతాలకు తొలిసారి మెరుగైన రైలు కనెక్టివిటీ
- ఐదేళ్లలో పూర్తి చేయడమే కేంద్రం లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో రవాణా రంగాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేలా కేంద్ర ప్రభుత్వం మరో సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కీలకమైన మణుగూరు-రామగుండం కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. దాదాపు రూ. 5,818.45 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (PPP – Public Private Partnership) పద్ధతిలో చేపట్టనున్నారు. ఈ కొత్త లైన్ అందుబాటులోకి వస్తే తెలంగాణలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు రైల్వే సౌకర్యం దక్కడంతో పాటు, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు పెద్ద ఉపశమనం లభించనుంది.
మొత్తం 207.8 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ సరికొత్త రైల్వే లైన్ మంథని, భూపాలపల్లి, తాడ్వాయి, గోపాలరావుపేటలతో పాటు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర జరిగే మేడారం మీదుగా వెళ్లనుంది. ప్రస్తుతం మణుగూరు నుండి రామగుండం వెళ్లాలంటే భద్రాచలం రోడ్ (కొత్తగూడెం), కాజీపేట మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. కానీ, ఈ కొత్త లైన్ పూర్తయితే మణుగూరు-రామగుండం మధ్య ఏకంగా 90 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీనివల్ల ప్రయాణికులకు సమయం, డబ్బు భారీగా ఆదా అవుతాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరతో పాటు, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వెళ్లే భక్తులకు కనెక్టివిటీ మరింత సులభతరం కానుంది.
Also Read
- Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే 'కమలం' వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా ములుగు, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వెనుకబడిన మారుమూల గిరిజన ప్రాంతాలకు ఒక పెద్ద వరంగా మారబోతోంది. దశాబ్దాలుగా రైలు ముఖం చూడని ఎన్నో గ్రామాలకు ఈ లైన్ ద్వారా రైల్వే కనెక్టివిటీ లభిస్తుంది. కేవలం ప్రయాణికులకు మాత్రమే కాకుండా, ఈ ప్రాంతంలో లభించే బొగ్గు (Coal), ఖనిజాలు, ఎరువులు , ఇతర పారిశ్రామిక సరుకు రవాణాకు (Freight Transport) ఈ రైల్వే లైన్ అత్యంత కీలకంగా మారనుంది. దీనివల్ల సింగరేణి బొగ్గు గనుల రవాణా మరింత వేగవంతం కానుంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసేందుకు రైల్వే శాఖ సరికొత్త ప్లాన్ సిద్ధం చేసింది. డీపీఆర్ (DPR) తయారీ, ల్యాండ్ అక్విజిషన్ (భూసేకరణ), వివిధ ప్రభుత్వ శాఖల నుండి అనుమతులు తీసుకునే బాధ్యతలను రైల్వే శాఖ చూసుకుంటుంది. అయితే, ప్రాజెక్ట్ నిర్మాణం , నిధుల సమీకరణ పనులను ప్రైవేట్ భాగస్వామ్య సంస్థకు అప్పగిస్తారు. దీనికోసం రైల్వే శాఖ త్వరలోనే టెండర్లను ఆహ్వానించనుంది. ఈ ప్రాజెక్ట్ టైమ్లైన్ ప్రకారం.. మొదటి ఏడాదిలో పూర్తిగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, ఆ తర్వాత నాలుగు సంవత్సరాలలో అంటే మొత్తం ఐదేళ్ల వ్యవధిలో ఈ కొత్త రైల్వే లైన్ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!