New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
- మణుగూరు–రామగుండం కొత్త రైల్వే లైన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- మేడారం, భద్రాచలం భక్తులకు భారీ ఊరట
- గిరిజన ప్రాంతాలకు తొలిసారి మెరుగైన రైలు కనెక్టివిటీ
- ఐదేళ్లలో పూర్తి చేయడమే కేంద్రం లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో రవాణా రంగాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేలా కేంద్ర ప్రభుత్వం మరో సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కీలకమైన మణుగూరు-రామగుండం కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. దాదాపు రూ. 5,818.45 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (PPP – Public Private Partnership) పద్ధతిలో చేపట్టనున్నారు. ఈ కొత్త లైన్ అందుబాటులోకి వస్తే తెలంగాణలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు రైల్వే సౌకర్యం దక్కడంతో పాటు, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు పెద్ద ఉపశమనం లభించనుంది.
మొత్తం 207.8 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ సరికొత్త రైల్వే లైన్ మంథని, భూపాలపల్లి, తాడ్వాయి, గోపాలరావుపేటలతో పాటు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర జరిగే మేడారం మీదుగా వెళ్లనుంది. ప్రస్తుతం మణుగూరు నుండి రామగుండం వెళ్లాలంటే భద్రాచలం రోడ్ (కొత్తగూడెం), కాజీపేట మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. కానీ, ఈ కొత్త లైన్ పూర్తయితే మణుగూరు-రామగుండం మధ్య ఏకంగా 90 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీనివల్ల ప్రయాణికులకు సమయం, డబ్బు భారీగా ఆదా అవుతాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరతో పాటు, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వెళ్లే భక్తులకు కనెక్టివిటీ మరింత సులభతరం కానుంది.
Also Read
ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా ములుగు, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వెనుకబడిన మారుమూల గిరిజన ప్రాంతాలకు ఒక పెద్ద వరంగా మారబోతోంది. దశాబ్దాలుగా రైలు ముఖం చూడని ఎన్నో గ్రామాలకు ఈ లైన్ ద్వారా రైల్వే కనెక్టివిటీ లభిస్తుంది. కేవలం ప్రయాణికులకు మాత్రమే కాకుండా, ఈ ప్రాంతంలో లభించే బొగ్గు (Coal), ఖనిజాలు, ఎరువులు , ఇతర పారిశ్రామిక సరుకు రవాణాకు (Freight Transport) ఈ రైల్వే లైన్ అత్యంత కీలకంగా మారనుంది. దీనివల్ల సింగరేణి బొగ్గు గనుల రవాణా మరింత వేగవంతం కానుంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసేందుకు రైల్వే శాఖ సరికొత్త ప్లాన్ సిద్ధం చేసింది. డీపీఆర్ (DPR) తయారీ, ల్యాండ్ అక్విజిషన్ (భూసేకరణ), వివిధ ప్రభుత్వ శాఖల నుండి అనుమతులు తీసుకునే బాధ్యతలను రైల్వే శాఖ చూసుకుంటుంది. అయితే, ప్రాజెక్ట్ నిర్మాణం , నిధుల సమీకరణ పనులను ప్రైవేట్ భాగస్వామ్య సంస్థకు అప్పగిస్తారు. దీనికోసం రైల్వే శాఖ త్వరలోనే టెండర్లను ఆహ్వానించనుంది. ఈ ప్రాజెక్ట్ టైమ్లైన్ ప్రకారం.. మొదటి ఏడాదిలో పూర్తిగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, ఆ తర్వాత నాలుగు సంవత్సరాలలో అంటే మొత్తం ఐదేళ్ల వ్యవధిలో ఈ కొత్త రైల్వే లైన్ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!