New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
- మణుగూరు–రామగుండం కొత్త రైల్వే లైన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- మేడారం, భద్రాచలం భక్తులకు భారీ ఊరట
- గిరిజన ప్రాంతాలకు తొలిసారి మెరుగైన రైలు కనెక్టివిటీ
- ఐదేళ్లలో పూర్తి చేయడమే కేంద్రం లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో రవాణా రంగాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేలా కేంద్ర ప్రభుత్వం మరో సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కీలకమైన మణుగూరు-రామగుండం కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. దాదాపు రూ. 5,818.45 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (PPP – Public Private Partnership) పద్ధతిలో చేపట్టనున్నారు. ఈ కొత్త లైన్ అందుబాటులోకి వస్తే తెలంగాణలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు రైల్వే సౌకర్యం దక్కడంతో పాటు, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు పెద్ద ఉపశమనం లభించనుంది.
మొత్తం 207.8 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ సరికొత్త రైల్వే లైన్ మంథని, భూపాలపల్లి, తాడ్వాయి, గోపాలరావుపేటలతో పాటు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర జరిగే మేడారం మీదుగా వెళ్లనుంది. ప్రస్తుతం మణుగూరు నుండి రామగుండం వెళ్లాలంటే భద్రాచలం రోడ్ (కొత్తగూడెం), కాజీపేట మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. కానీ, ఈ కొత్త లైన్ పూర్తయితే మణుగూరు-రామగుండం మధ్య ఏకంగా 90 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీనివల్ల ప్రయాణికులకు సమయం, డబ్బు భారీగా ఆదా అవుతాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరతో పాటు, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వెళ్లే భక్తులకు కనెక్టివిటీ మరింత సులభతరం కానుంది.
Also Read
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా ములుగు, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వెనుకబడిన మారుమూల గిరిజన ప్రాంతాలకు ఒక పెద్ద వరంగా మారబోతోంది. దశాబ్దాలుగా రైలు ముఖం చూడని ఎన్నో గ్రామాలకు ఈ లైన్ ద్వారా రైల్వే కనెక్టివిటీ లభిస్తుంది. కేవలం ప్రయాణికులకు మాత్రమే కాకుండా, ఈ ప్రాంతంలో లభించే బొగ్గు (Coal), ఖనిజాలు, ఎరువులు , ఇతర పారిశ్రామిక సరుకు రవాణాకు (Freight Transport) ఈ రైల్వే లైన్ అత్యంత కీలకంగా మారనుంది. దీనివల్ల సింగరేణి బొగ్గు గనుల రవాణా మరింత వేగవంతం కానుంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసేందుకు రైల్వే శాఖ సరికొత్త ప్లాన్ సిద్ధం చేసింది. డీపీఆర్ (DPR) తయారీ, ల్యాండ్ అక్విజిషన్ (భూసేకరణ), వివిధ ప్రభుత్వ శాఖల నుండి అనుమతులు తీసుకునే బాధ్యతలను రైల్వే శాఖ చూసుకుంటుంది. అయితే, ప్రాజెక్ట్ నిర్మాణం , నిధుల సమీకరణ పనులను ప్రైవేట్ భాగస్వామ్య సంస్థకు అప్పగిస్తారు. దీనికోసం రైల్వే శాఖ త్వరలోనే టెండర్లను ఆహ్వానించనుంది. ఈ ప్రాజెక్ట్ టైమ్లైన్ ప్రకారం.. మొదటి ఏడాదిలో పూర్తిగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, ఆ తర్వాత నాలుగు సంవత్సరాలలో అంటే మొత్తం ఐదేళ్ల వ్యవధిలో ఈ కొత్త రైల్వే లైన్ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్కు చిరంజీవి మెగా బర్త్డే విషెస్!
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్తో రోజంతా సాఫ్ట్గా!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!