Adhir Ranjan: కాంగ్రెస్ అవమానిస్తే ఎన్డీయేలో చేరండి.. అధిర్ రంజన్కి కేంద్రమంత్రి ఆహ్వానం..
- కాంగ్రెస్ అవమానిస్తే ఎన్డీయేలో చేరండి..
- అధిర్ రంజన్కి కేంద్రమంత్రి ఆహ్వానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adhir Ranjan: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఎన్డీయే కూటమిలో చేరాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఆహ్వానించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) చీఫ్ అథవాలే మాట్లాడుతూ.. అతను (అధిర్ రంజన్) పశ్చిమ బెంగాల్ నుంచి ఓడిపోయినందుకు కాంగ్రెస్ విస్మరించిందని, అవమానించబడ్డాడని అన్నారు. కాంగ్రెస్ ఇలాంటి వైఖరి వల్లే చాలా మంది నేతలు కాంగ్రెస్ వదిలి బీజేపీలో చేరారని అన్నారు. కాంగ్రెస్ అవమానిస్తే, ఆ పార్టీని వీడాలని అధిర్ రంజన్ని అభ్యర్థిస్తున్నానని అథవాలే అన్నారు. ఎన్డీయేలో లేదా తన పార్టీ ఆర్పీఐలో చేరాలని ఆహ్వానించారు.
Read Also: Minister Narayana: నవీ ముంబైలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బృందం పర్యటన
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్గా ఉన్న తనను ఎలా తొలగించారని అధిర్ రంజన్ మంగళవారం అసంతృప్తిని వ్యక్తం చేశారు. మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడైన రోజు, పార్టీ రాజ్యాంగం ప్రకారం దేశంలోని పార్టీలోని అన్ని పదవులు తాత్కాలికంగా మారాయి, నా పదవి కూడా తాత్కాలికమే అని అధిర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఖర్గే మాట్లాడుతూ.. అవసరమైతే తనను బయట ఉంచుతామని చెప్పడం నన్ను కలవరపెట్టిందని చెప్పారు. తాత్కాలిక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, అది నా బాధ్యతని, వీలైతే మీరు నా స్థానంలో మరొకరిని నియమించుకోవచ్చని ఖర్గేకి తాను చెప్పినట్లు తెలిపారు.
‘‘ నా అధ్యక్షతన సమావేశం జరిగిందని, నేను ఇప్పటికీ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నానని నాకు తెలుసు. కానీ సమావేశంలో గులాం అలీ మీర్ ప్రసంగిస్తూ మాజీ అధ్యక్షుడు కూడా ఇక్కడే ఉన్నారని అన్నారు. ఆ సమయంలోనే తాకు తెలిసింది నేను మాజీ అధ్యక్షుడినయ్యానని’’ అని అతను చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీతో పొత్తను అధిర్ రంజన్ వ్యతిరేకించారు. ఎన్నికల్లో పొత్తు లేకుండానే టీఎంసీ, కాంగ్రెస్ పోటీ చేశాయి. మొత్తం 42 సీట్లలో టీఎంసీ 29 సీట్లు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ ఒకే స్థానంలో గెలుపొందింది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!