Arvind Kejriwal: కాంగ్రెస్- బీజేపీ మధ్య ఉన్న సత్సంబంధాలు బయటపడుతున్నాయి..
- కాంగ్రెస్- బీజేపీ మధ్య బంధం బయటపడుతుంది..
- రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దు..
- కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారు: కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు బీజేపీ సీనియర్ నేత, అమిత్ మాలవీయ దేశం గురించి తర్వాత ఆలోచించండి.. ముందు మీ సీటును కాపాడుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే విషయం ప్రజలకు అర్థమవుతోందన్నారు. ఈ రెండు పార్టీల మధ్య అనుబంధాన్ని ఢిల్లీ ఎన్నికలు బహిర్గతం చేస్తాయన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి రాహుల్ యత్నిస్తున్నారని పేర్కొన్నారు. తాను దేశ రక్షణ కోసం కృషి చేస్తున్నా.. తనపై అతడు చేసిన విమర్శలను పట్టించుకోనని కేజ్రీవాల్ వెల్లడించారు.
Read Also: Piyush Goyal: 40 రైతుల ఏళ్ల కల నెరవేరింది.. ఈ ఘనత వాళ్లదే..
Also Read
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
ఇక, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీలంపుర్లో సోమవారం నాడు జరిగిన జై బాపు, జై భీం, జై సంవిధాన్’ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఆప్ సర్కార్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. మోడీ అనుసరించే ప్రచార కండూతి వ్యూహం, అబద్ధపు హామీల బాటలో కేజ్రీవాల్ సైతం నడుస్తున్నారని చెప్పుకొచ్చారు. కాలుష్యం, అవినీతి, ధరల పెరుగుదలను వారిద్దరూ పట్టించుకోవడం లేదన్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు రిజర్వేషన్లలో తమ వాటాలను సాధించుకునేందుకు చేపట్టాల్సిన కులగణనపై మోడీ, కేజ్రీవాల్ మౌనం వహిస్తున్నారని విమర్శలు చేశారు. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
Read Also: Laurene Powell: మహా కుంభమేళాలో అస్వస్థతకు గురైన స్టీవ్ జాబ్స్ భార్య..
అయితే, 70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఈసీ తెలిపింది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను రిలీజ్ చేస్తామని ఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ చెప్పారు. 2015 నుంచి రెండుసార్లు గెలిచిన ఆప్.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తుండగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈసారి ఢిల్లీలో పాగా వేయాలని ట్రై చేస్తుంది. మరోసారి ఢిల్లీలో అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది.
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..