High Speed Rail: దక్షిణాది వాసులకు గుడ్న్యూస్.. హైదరాబాద్-బెంగళూరుకు 2 గంటల్లో చేరే హైస్పీడ్ రైలు!
- దక్షిణాది వాసులకు గుడ్న్యూస్
- హైదరాబాద్-బెంగళూరుకు 2 గంటల్లో చేరే హైస్పీడ్ రైలు!
- ప్రణాళికలు సిద్ధం చేసిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమాన ప్రయాణానికి ధీటుగా హైదరాబాద్-బెంగళూరు, చెన్నైకి హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ హై స్పీడ్ రైళ్లు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం 2 గంటల్లో.. చెన్నైకి 2 గంటల 20 నిమిషాల్లో ప్రయాణీకులను చేరవేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు మరియు చెన్నైకి విమానాలు వరుసగా 1 గంట 15 నిమిషాలు మరియు 1 గంట 20 నిమిషాలు చేరుకోవడానికి పడుతుంది. ఇక ఎయిర్పోర్టుల నుంచి ఇళ్లకు చేరేందుకు మొత్తంగా 2-3 గంటల సమయం పడుతుంది. ఇదే సమయంలో హైస్పీడ్ రైళ్లు తీసుకొస్తే ఎలా ఉంటుందని కేంద్రం యోచిస్తోంది.
ఇది కూడా చదవండి: Laila : ‘లైలా’ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. నా కెరీర్ లో మెమరబుల్ మూవీ : విశ్వక్సేన్
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
రెండు హైస్పీడ్ రైళ్ల కోసం కారిడార్లను అభివృద్ధి చేయాలని కేంద్రం ప్రణాళిక రచిస్తోంది. దాదాపు 10 గంటల సమయం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైళ్లు గంటకు 320 కి.మీ వేగంతో నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. విమాన ప్రయాణానికి పోటీగా ఈ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోందని జాతీయ మీడియా ఒక కథనంలో పేర్కొంది. ఇందుకోసం హైదరాబాద్-చెన్నై కారిడార్ 705 కి.మీ. విస్తరించాలని ప్రతిపాదించగా.. హైదరాబాద్-బెంగళూరు మార్గం 626 కి.మీ. ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థ మరియు ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ అయిన ఆర్ఐటీఈఎస్ లిమిటెడ్ను సర్వే కోసం టెండర్లను ఆహ్వానించింది. సర్వే మరియు అంచనాకు రూ.33 కోట్లు ఖర్చవుతుందని సమాచారం.
ఇది కూడా చదవండి: Badmashulu Teasir: బద్మాషులు టీజర్.. వీళ్ళు నిజంగానే బద్మాషుల్లాగా ఉన్నారే
వందే భారత్ వంటి సరుకు రవాణా రైళ్లు, ప్రయాణీకులకు సేవలు అందించే సాంప్రదాయ రైలు పట్టాల మాదిరిగా కాకుండా… ఈ కొత్త కారిడార్లు ప్రత్యేకంగా హై-స్పీడ్ రైళ్ల కోసం నిర్మించనున్నారు. ఈ డిజైన్ ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ కారిడార్ మాదిరిగా ఉంటుంది. బుల్లెట్ రైలు నడిచే విధంగా పట్టాలు ఏర్పాటు చేయనున్నారు. ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్ట్ 2015 లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ కారిడార్లు తుది రూపం దాల్చడానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టవచ్చని దక్షిణ మధ్య రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఇది కూడా చదవండి: Kamal Haasan: కమల్ హాసన్కు ప్రమోషన్.. త్వరలో రాజ్యసభలోకి ఎంట్రీ!
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?