Maharashtra Bus Fire: మహారాష్ట్ర బస్సు అగ్నిప్రమాదం.. 25 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఇదే కావచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Bus Fire: మహారాష్ట్రలో ఘోర బస్సు అగ్నిప్రమాదంలో 25 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధాని నరేంద్రమోడీ సంఘటనలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై శనివారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం జరిగింది. మొత్తం 33 మంది ప్రయాణికుల్లో 8 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు నాగ్పూర్ నుంచి పూణే వెళ్తున్న సమయంలో అగ్నికి ఆహుతైంది.
ఈ ప్రమాదానికి ‘‘మానవ తప్పిదమే’’ కారణమని మహారాష్ట్ర పోలీసులు అనుమానిస్తున్నారు. టైర్ పగిలిపోవడంతో నియంత్రణ కోల్పోయిన డివైడర్ ని ఢీకొట్టిందని, ఆ తరువాత బస్సుకు మంటలు అంటుకున్నాయని డ్రైవర్ చెప్పాడు. అయితే ఇందుకు విరుద్ధంగా డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న సమయంలో ప్రైవేట్ స్లీపర్ కోచ్ అయిన బస్సుపై నియంత్రణ కోల్పోయిన ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డిజిల్ ట్యాంకర్ పగిలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక నివేదిక చెబుతోంది.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
నాగ్పూర్ నుంచి పూణేకి మొత్తం 33 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. తెల్లవారుజామున 1.30 గంటలకు సింధ్ఖేడ్రాజా సమీపంలోని పింపాల్ఖుటా గ్రామంలో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్, క్లీనర్ తో సహా 8 మంది పగిలిన కిటీకీల నుంచి బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన 25 మంది సజీవ దహనమయ్యారు. బస్సు ముందుగా యవత్మాల్ జిల్లా కరంజా వద్ద భోజనం కోసం ఆగింది. కేవలం రెండున్నర గంటల్లోనే బస్సు ఏకంగా 150 కిలోమీటర్ల ప్రయాణించినట్లు తెలుస్తోంది. బస్సు యావరేజ్ స్పీడ్ గంటకు 60-70 కిలోమీటర్లు ఉందని పోలీసులు తెలిపారు.
బస్సు వేగం ప్రమాదానికి కారణం కాకపోయి ఉండొచ్చని.. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని తెలుస్తోందని పోలీసులు వెల్లడిస్తున్నారు. డ్రైవర్ నిద్రపోయి ఉండొచ్చని.. బస్సు ముందుగా కుడి వైపు వెళ్లి ఆ తరువాత క్రాష్ బారియర్ను, ఆపై డివైడర్ ని ఢీకొట్టిందని అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలో టైర్ పగిలిన ఆనవాళ్లు, టైర్ గుర్తులు, రబ్బర్ ముక్కలు లేవని అమరావతి ప్రాంతీయ రవాణా కార్యాలయం నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?