Maharashtra Bus Fire: మహారాష్ట్ర బస్సు అగ్నిప్రమాదం.. 25 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఇదే కావచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Bus Fire: మహారాష్ట్రలో ఘోర బస్సు అగ్నిప్రమాదంలో 25 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధాని నరేంద్రమోడీ సంఘటనలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై శనివారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం జరిగింది. మొత్తం 33 మంది ప్రయాణికుల్లో 8 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు నాగ్పూర్ నుంచి పూణే వెళ్తున్న సమయంలో అగ్నికి ఆహుతైంది.
ఈ ప్రమాదానికి ‘‘మానవ తప్పిదమే’’ కారణమని మహారాష్ట్ర పోలీసులు అనుమానిస్తున్నారు. టైర్ పగిలిపోవడంతో నియంత్రణ కోల్పోయిన డివైడర్ ని ఢీకొట్టిందని, ఆ తరువాత బస్సుకు మంటలు అంటుకున్నాయని డ్రైవర్ చెప్పాడు. అయితే ఇందుకు విరుద్ధంగా డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న సమయంలో ప్రైవేట్ స్లీపర్ కోచ్ అయిన బస్సుపై నియంత్రణ కోల్పోయిన ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డిజిల్ ట్యాంకర్ పగిలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక నివేదిక చెబుతోంది.
Also Read
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
నాగ్పూర్ నుంచి పూణేకి మొత్తం 33 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. తెల్లవారుజామున 1.30 గంటలకు సింధ్ఖేడ్రాజా సమీపంలోని పింపాల్ఖుటా గ్రామంలో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్, క్లీనర్ తో సహా 8 మంది పగిలిన కిటీకీల నుంచి బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన 25 మంది సజీవ దహనమయ్యారు. బస్సు ముందుగా యవత్మాల్ జిల్లా కరంజా వద్ద భోజనం కోసం ఆగింది. కేవలం రెండున్నర గంటల్లోనే బస్సు ఏకంగా 150 కిలోమీటర్ల ప్రయాణించినట్లు తెలుస్తోంది. బస్సు యావరేజ్ స్పీడ్ గంటకు 60-70 కిలోమీటర్లు ఉందని పోలీసులు తెలిపారు.
బస్సు వేగం ప్రమాదానికి కారణం కాకపోయి ఉండొచ్చని.. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని తెలుస్తోందని పోలీసులు వెల్లడిస్తున్నారు. డ్రైవర్ నిద్రపోయి ఉండొచ్చని.. బస్సు ముందుగా కుడి వైపు వెళ్లి ఆ తరువాత క్రాష్ బారియర్ను, ఆపై డివైడర్ ని ఢీకొట్టిందని అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలో టైర్ పగిలిన ఆనవాళ్లు, టైర్ గుర్తులు, రబ్బర్ ముక్కలు లేవని అమరావతి ప్రాంతీయ రవాణా కార్యాలయం నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
-
RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
-
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్తో యువ కార్మికుడు మృతి!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!