CBSE: సీబీఎస్ఈ కీలక నిర్ణయం… ఇకపై ప్రాంతీయ భాషలో బోధన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBSE: మానవుని జీవితంలో విద్య ఎంతో ప్రదానమైంది. విద్యతోనే మానిషి జీవితంలో ఎదగ గలడు. చదువుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కోసం చూస్తుంటారు.. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే వేయాలని చూస్తారు. అలా మంచి పేరున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూల్స్ లో సీటు కోసం చూస్తుంటారు. అయితే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వాటిల్లో కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే విద్య కొనసాగుతుంటుంది. తమ మాతృభాషలో విద్యను కొనసాగించలేకపోతారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) బీర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరు తమకు నచ్చిన భాషలో బోధనా మధ్యామాన్ని ఎంచుకొనేలా నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు తమకు నచ్చిన భారతీయ భాషలను బోధనా మాధ్యమంగా ఎంచుకునేందుకు సీబీఎస్ఈ పాఠశాలలకు అనుమతించింది.
Read also: Drones: రాజధానిలో ఇక నుంచి డ్రోన్లు ఎగరేయకూడదు.. బెలూన్-పారాగ్లైడర్ కూడా ?
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
జాతీయ విద్యావిధానం పాలసీ(NEP)ని ప్రోత్సహించే విధంగా సీబీఎస్ఈ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు తమకు నచ్చిన భారతీయ భాషలను బోధనా మాధ్యమంగా ఎంచుకునేందుకు సీబీఎస్ఈ పాఠశాలలకు అనుమతించింది. ప్రస్తుతం మెజారిటీ సీబీఎస్ఈ పాఠశాల్లలో ఆంగ్లంలో బోధిస్తుండగా కొన్ని పాఠశాల్లలో మాత్రమే హిందీలో బోధన సాగుతోంది. ఇప్పటి వరకు సీబీఎస్ఈ పాఠశాల్లలో భారతీయ భాషల్లో బోధించేందుకు అనుమతి లేదు. తాజా ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలు తమకు నచ్చిన భారతీయ భాషల్లో బోధనను కొనసాగించవచ్చు. ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) ఉన్నత విద్యలో సైతం మాతృభాషల్లో బోధించేందుకు ఇలాంటి ఉత్తర్వులనే జారీ చేసింది. ఇదొక చరిత్రాత్మక నిర్ణయమని జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే భారతీయ భాషా సమితి అధ్యక్షుడు చాము కృష్ణ శాస్తి అన్నారు. ఈ నిర్ణయంతో బోధన, అభ్యాసరీతులు భారతీయీకరణం చెందడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అవకాశాలు వస్తాయన్నారు. ప్రస్తుతం వృత్తిపరమైన విద్యలో ప్రాంతీయ భాషలను యూజీసీ అందుబాటులోకి తేగా, ఇప్పుడు పాఠశాల స్థాయిల్లో స్థానిక భాషలను ఐచ్ఛికంగా ఎంచుకునేందుకు సీబీఎస్ఈ కూడా ఈ అవకాశం కల్పించిందని అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఈ నిర్ణయం ఎంతో ముఖ్యపాత్ర వహిస్తుందని శాస్త్రి అన్నారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ ఈ నిర్ణయంపై సీబీఎస్ఈను అభినందించారు. పాఠశాల స్థాయిలో మాతృభాష, భారతీయ భాషల్లో ప్రోత్సహించే అభినందన చర్య అని ట్వీట్టర్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
ట్రెండింగ్
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!