Hate Speech Bill: సోషల్ మీడియాపై కర్ణాటక సర్కార్ ఆంక్షలు.. హేట్ స్పీచ్ చేస్తే మూడేళ్లు జైలు శిక్ష
- సోషల్ మీడియా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..
- హేట్ స్పీచ్, హేట్ క్రైమ్స్ బిల్లు పేరిట ముసాయిదా చట్టంలో కీలక నిబంధనలు..
- రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే నాన్ బెయిలబుల్ కేసులతో పాటు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేలు ఫైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hate Speech Bill: సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ ఫాంల కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్వేషపూరిత ప్రసంగం (హేట్ స్పీచ్ ) చేస్తే నాన్ బెయిలబుల్ కేసులతో పాటు 3 జైలు శిక్ష, రూ. 5 వేలు ఫైన్ విధించేలా చట్టం తీసుకొస్తుంది. కర్ణాటక హేట్ స్పీచ్, హేట్ క్రైమ్స్ బిల్లు 2025 పేరిట ముసాయిదా చట్టంలో కీలక నిబంధనలను రూపొందించారు. ఇందులో డిజిటల్ ప్లాట్ఫామ్ల కట్టుదిట్టమైన నియంత్రణతో పాటు జిల్లా స్థాయి అధికారులకు వాటిని నిరోధించే హక్కులను ఇచ్చారు. ఈ బిల్లులో ద్వేషపూరిత ప్రసంగాలకు బెయిల్ లేకుండా కేసు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
Read Also: BCCI-IPL: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. బీసీసీఐ కీలక నిర్ణయం!
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
అయితే, సోషల్ మీడియా సంస్థలు, టెలికం కంపెనీలు, ఆన్లైన్ మార్కెట్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తమ అకౌంట్లలో రెచ్చగొట్టే కంటెంట్ ని ప్రసారం చేస్తే.. మూడేళ్ల జైలు శిక్ష విధించే ఛాన్స్ ఉంది. హేట్ స్పీచ్ లేదా హేట్ క్రైమ్స్కు ఆర్థిక సాయం, ఇతర సహాయం చేసిన వారిని కూడా ప్రధాన దోషులుగా శిక్షించనున్నట్లు ముసాయిదా బిల్లులో చేర్చారు. మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకునే ఛాన్స్ ఉన్న ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు ర్యాలీలు, బహిరంగ సభలు, లౌడ్ స్పీకర్ల వినియోగం వంటి కార్యకలాపాలను 30 రోజుల పాటు నిషేధించగలిగే అధికారం కట్టబెట్టింది. అవసరమైతే ఈ ఆదేశాలను 60 రోజులకు పొడిగించే అవకాశం ఉందన్నారు. భావ ప్రకటనా స్వేచ్చను ఎప్పటిలాగే ప్రతి ఒక్కరూ పొందవచ్చని ఆ బిల్లులో వెల్లడించింది.
Read Also: Minister Narayana: భూ కేటాయింపులపై కీలక నిర్ణయాలు.. 12 అంశాలకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం..!
ఇక, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం కర్ణాటక ప్రభుత్వ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు, ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రచారాలు నిర్వహించాలని మూసాయిదా బిల్లులో తెలిపారు. ఈ బాధ్యతలు మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్ లాంటి సంస్థలకు అప్పగించే ఛాన్స్ ఉంది. రాష్ట్ర శాసనసభ పర్యవేక్షణతో పాటు చట్ట అమలుకు అవసరమైన నియమాలను రూపొందించే అధికారం రాష్ట్ర సర్కార్ కి ఇవ్వనుంది. ఈ చట్టం అమలైతే విద్వేషాలు వ్యాప్తి చేసే విషయంలో డిజిటల్ మీడియాను కర్ణాటక ప్రభుత్వం కట్టడి చేసే ఛాన్స్ కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!