Hate Speech Bill: సోషల్ మీడియాపై కర్ణాటక సర్కార్ ఆంక్షలు.. హేట్ స్పీచ్ చేస్తే మూడేళ్లు జైలు శిక్ష
- సోషల్ మీడియా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..
- హేట్ స్పీచ్, హేట్ క్రైమ్స్ బిల్లు పేరిట ముసాయిదా చట్టంలో కీలక నిబంధనలు..
- రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే నాన్ బెయిలబుల్ కేసులతో పాటు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేలు ఫైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hate Speech Bill: సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ ఫాంల కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్వేషపూరిత ప్రసంగం (హేట్ స్పీచ్ ) చేస్తే నాన్ బెయిలబుల్ కేసులతో పాటు 3 జైలు శిక్ష, రూ. 5 వేలు ఫైన్ విధించేలా చట్టం తీసుకొస్తుంది. కర్ణాటక హేట్ స్పీచ్, హేట్ క్రైమ్స్ బిల్లు 2025 పేరిట ముసాయిదా చట్టంలో కీలక నిబంధనలను రూపొందించారు. ఇందులో డిజిటల్ ప్లాట్ఫామ్ల కట్టుదిట్టమైన నియంత్రణతో పాటు జిల్లా స్థాయి అధికారులకు వాటిని నిరోధించే హక్కులను ఇచ్చారు. ఈ బిల్లులో ద్వేషపూరిత ప్రసంగాలకు బెయిల్ లేకుండా కేసు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
Read Also: BCCI-IPL: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. బీసీసీఐ కీలక నిర్ణయం!
Also Read
అయితే, సోషల్ మీడియా సంస్థలు, టెలికం కంపెనీలు, ఆన్లైన్ మార్కెట్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తమ అకౌంట్లలో రెచ్చగొట్టే కంటెంట్ ని ప్రసారం చేస్తే.. మూడేళ్ల జైలు శిక్ష విధించే ఛాన్స్ ఉంది. హేట్ స్పీచ్ లేదా హేట్ క్రైమ్స్కు ఆర్థిక సాయం, ఇతర సహాయం చేసిన వారిని కూడా ప్రధాన దోషులుగా శిక్షించనున్నట్లు ముసాయిదా బిల్లులో చేర్చారు. మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకునే ఛాన్స్ ఉన్న ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు ర్యాలీలు, బహిరంగ సభలు, లౌడ్ స్పీకర్ల వినియోగం వంటి కార్యకలాపాలను 30 రోజుల పాటు నిషేధించగలిగే అధికారం కట్టబెట్టింది. అవసరమైతే ఈ ఆదేశాలను 60 రోజులకు పొడిగించే అవకాశం ఉందన్నారు. భావ ప్రకటనా స్వేచ్చను ఎప్పటిలాగే ప్రతి ఒక్కరూ పొందవచ్చని ఆ బిల్లులో వెల్లడించింది.
Read Also: Minister Narayana: భూ కేటాయింపులపై కీలక నిర్ణయాలు.. 12 అంశాలకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం..!
ఇక, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం కర్ణాటక ప్రభుత్వ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు, ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రచారాలు నిర్వహించాలని మూసాయిదా బిల్లులో తెలిపారు. ఈ బాధ్యతలు మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్ లాంటి సంస్థలకు అప్పగించే ఛాన్స్ ఉంది. రాష్ట్ర శాసనసభ పర్యవేక్షణతో పాటు చట్ట అమలుకు అవసరమైన నియమాలను రూపొందించే అధికారం రాష్ట్ర సర్కార్ కి ఇవ్వనుంది. ఈ చట్టం అమలైతే విద్వేషాలు వ్యాప్తి చేసే విషయంలో డిజిటల్ మీడియాను కర్ణాటక ప్రభుత్వం కట్టడి చేసే ఛాన్స్ కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!