Haryana: హర్యానాలో దారుణం.. అక్రమ మైనింగ్ అడ్డుకోబోయిన డీఎస్పీని తొక్కించి చంపిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో దారుణం జరిగింది. అక్రమ మైనింగ్ ను అడ్డుకోబోయిన డీఎస్పీ అధికారిని లారీలో తొక్కించి చంపేసింది మైనింగ్ మాఫియా. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మంగళవారం హర్యానా నుహ్ లో రాళ్ల అక్రమ మైనింగ్ జరుగుతుందనే సమాచారంతో డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ తన టీంతో కలిసి ఆరావళి పర్వత శ్రేణి సమీపంలోని పచ్గావ్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ ఆపేందుకు ఉదయం 11 గంటలకు ఘటన స్థలానికి వెళ్లారు. అయితే పోలీసులు రావడాన్ని గుర్తించిన మైనింగ్ మాఫియా అక్కడి నుంచి పారిపోయారు.
అయితే ఇదే సమయంలో అక్కడ నుంచి లారీతో పాటు పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించగా.. వారిని ఆపేందుకు లారీకి అడ్డుగా నిలబడ్డాడు. అయితే ఈ క్రమంలో లారీ ఆపకపోగా.. డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ పై నుంచి పోనిచ్చారు. దీంతో ఆయన అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు పోలీసులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. లారీతో ఢీ కొట్టిన తరువాత నిందితుడు ఘటన స్థలం నుంచి పారిపోయాడు. ప్రస్తుతం నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. మరణించిన డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ కి హర్యానా పోలీసులు సంతాపాన్ని తెలియజేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
Also Read
- ED: ఈడీ సంచలన చర్య.. తొలిసారి విమానం వేలం.. చాలా చీఫ్గా విక్రయం
- Dhruv Rathee: రాముడు-సీతలపై వ్యాఖ్యలు.. ధ్రువ్ రాఠీ వీడియో తొలగింపుపై హైకోర్టు డెడ్లైన్
- Gold Scheme: బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం!.. కొత్త స్కీమ్ ప్రకటనకు రంగం సిద్ధం!
- Allahabad High Court: హలాలా, ట్రిపుల్ తలాక్ పేరుతో లైంగిక దోపిడీ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
Read Also: NIA Raids in Andhra Pradesh: ఏపీలో ఎన్ఐఏ సోదాల కలకలం.. ఏకకాలంలో 4 చోట్ల..!
ఈ ఘటనపై హర్యానా సర్కార్ సీరియస్ అయింది. హోం మంత్రి అనిల్ విజ్ నిందితులను విడిచిపెట్టబోమని.. కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హర్యానా రాష్ట్రంలో అక్రమ మైనింగ్ వ్యాపారం తీవ్రంగా ఉంది. 2021-22లో అసెంబ్లీకి సమర్పించిన ఓ రిపోర్టులో 2014-15 నుంచి 2021 వరకు ప్రభుత్వం అనుమతి లేకుండా రాష్ట్రంలో 21,450 అక్రమ మైనింగ్ కేసులు గుర్తించారు. 2009లో ఆరావళి ప్రాంతంలో సుప్రీం కోర్టు మైనింగ్ నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అయినా కూడా ఆరావళి ప్రాంతంలో మైనింగ్ నిరాటంకంగా కొనసాగుతోంది. ఆరావళి బచావో మూమెంట్ పేరుతో పౌర సంఘాలు ఈ ఏడాది గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయి. ఆరావళి ప్రాంతంలో కనీసం 16 చోట్ల అక్రమ మైనింగ్ సాగుతుందని ఆరోపించారు.
తాజావార్తలు
-
ED: ఈడీ సంచలన చర్య.. తొలిసారి విమానం వేలం.. చాలా చీఫ్గా విక్రయం
-
Dhruv Rathee: రాముడు-సీతలపై వ్యాఖ్యలు.. ధ్రువ్ రాఠీ వీడియో తొలగింపుపై హైకోర్టు డెడ్లైన్
-
Bhatti Vikramarka : దమ్ముంటే చర్చకు రండి.. కేసీఆర్ కు భట్టి ఓపెన్ ఛాలెంజ్.!
-
Pakistan: ‘‘దౌత్యం కడుపు నింపదు’’.. పాక్ పరువు తీసిన సింగపూర్ దౌత్యవేత్త..
-
Gold Scheme: బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం!.. కొత్త స్కీమ్ ప్రకటనకు రంగం సిద్ధం!
ట్రెండింగ్
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!