NIA Raids in Andhra Pradesh: ఏపీలో ఎన్ఐఏ సోదాల కలకలం.. ఏకకాలంలో 4 చోట్ల..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో ఎన్ఐఏ సోదాలు కలకలం సృష్టించాయి.. ఏకకాలంలో ప్రకాశం జిల్లా, విజయవాడ, నెల్లూరులో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. మావోయిస్టులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, విజయవాడలోని రెండు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష, విరసం నేత కల్యాణ్ రావు ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు.. శిరీష ఇంట్లో లేకపోవడంతో తాళం పగలగొట్టి మరీ సోదాలు చేపట్టడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.. విజయవాడలోనూ ఎన్ఐఏ సోదాలు చేసింది.. సింగ్ నగర్లో విరసం నేత దొడ్డి ప్రభాకర్ నివాసంలో తనిఖీలు చేశారు ఎన్ఐఏ అధికారులు.. మావోయిస్టులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో ఈ సోదాలు చెపట్టినట్టు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది.. ఆలకూరపాడు, విజయవాడ, నెల్లూరులలో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.. మావోయిస్ట్ నేత ఆర్కే భార్య పద్మ అలియాస్ శిరీష ఇంట్లో ఎన్ఐఏ అదికారుల సోదాలు చేస్తున్నారు.. ఆర్కే భార్య శిరీష ఇంట్లో లేకపోవటంతో తహశీల్దార్ సమక్షంలో ఇంటి తాళాలు పగులగొట్టి సోదాలు నిర్వహిస్తున్నారు.. ఉదయం మూడు గంటల నుండి తనిఖీలు కొనసాగుతున్నాయి.. విరసం నేతలపై కొద్దిరోజుల క్రితం విశాఖ జిల్లా పెద్దబాయలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. దీంతో, ఛత్తీస్గడ్కు చెందిన ఎన్ఐఏ అధికారుల బృందం విజయవాడకు చేరుకుని సింగ్నగర్లో విరసం నేత దొడ్డి ప్రభాకర్ ఇంట్లో కూడా సోదాలు చేసింది..
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
అయితే, సోదాలు నిర్వహించే సమయంలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ విజయవాడలో ఉన్నారు ఆర్కే భార్య శిరీష.. తాను ఇంట్లో లేని సమయంలో ఎన్ఐఏ అదికారుల సోదాలు నిర్వహించటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఎన్ఐఏ, పోలీస్ అధికారులు తమను తరచూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, విజయవాడ అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్లో ఓ గృహం లో ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.. గత ఏడాదిగా అక్కడ ఓ కుటుంబం అద్దెకు ఉంటుంది.. తెల్లవారుజామున ఒక్కసారిగా గృహంపై స్ధానిక ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ సాయంతో తనీఖీలు చేపట్టారు ఎన్ఐఏ అధికారులు.. ఈ ప్రాతం నుండి మావోయిస్టులకు నగదు బదీలలు జరిగినట్లు సమాచారం ఉందంటున్నారు.. స్థానిక పోలీసులను మావోయిస్టు సానుభూతి పరులుగా ఎన్ఐఏ అనుమానిస్తున్నట్టుగా తెలుస్తోంది.. వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు…
తాజావార్తలు
-
Ghost SIM Scam: ‘ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
-
OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న ‘ఓలా ఎలక్ట్రిక్’..
-
UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
-
PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
-
Electric Scooters: హీరో, టీవీఎస్, ఓలా.. అద్భుతమైన రేంజ్, ఫీచర్లు.. ధరలు కేవలం రూ.44,990 నుండి ప్రారంభం
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!