Hardeep Singh Puri: ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి దిగ్బంధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్-డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయనే వాదనల నేపథ్యంలో పెట్రోలియం, సహజవాయువల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ జలసంధి సమస్యలు ఉన్నప్పటికీ, దేశం వద్ద ముడి చమురు, ఎన్ఎన్జీ, ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయని ఆయన అన్నారు.
Read Also: Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
న్యూఢిల్లీలో జరిగిన ‘CII వార్షిక వ్యాపార సదస్సు 2026’లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచదేశాలు చమురు సంక్షోభంతో ఉన్నప్పటికీ, భారత్ మాత్రం ఒక స్థిరమైన స్థితిలో ఉందని ఆయన చెప్పారు. గత నాలుగేళ్లుగా ధరల్ని పెంచలేదని, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చమురు ధరలు 50-60 శాతం పెరిగినట్లు చెప్పారు. దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ద్వారా భారత్ సవాలును ఒక అవకాశంగా మలుచుకుందని చెప్పారు. గతంలో రోజుకు 36,000 మెట్రిక్ టన్నులుగా ఉండేదని, ఇప్పుడు దానిని రోజుకు 54,000 మెట్రిక్ టన్నులకు పెంచినట్లు వెల్లడించారు.
భారత్ వద్ద ప్రస్తుతం 60 రోజుల ముడి చమురు నిల్వలు, 60 రోజుల ఎల్ఎన్జీ, 45 రోజుల ఎల్పీజీ నిల్వలు ఉన్నట్లు చెప్పారు. భారతదేశానికి సరఫరాలో ఎలాంటి సమస్యలు లేవని పూరి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆయిల్ కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. రోజుకు సుమారు రూ. 1000 కోట్లు నష్టపోతున్నాయని వెల్లడించారు.
